15 లక్షల రుపాయాల , అవేక్కిడివి, మేము ఇస్తామని చెప్పలేదు,: రాజ్నాథ్ సింగ్
ప్రజల ఖాతాల్లో 15 లక్షల రుపాయాలు వేస్తామని బీజేపీ ఎప్పుడు చెప్పలేదని యూనియన్ మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్యూలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా 2014 ఎన్నికల్లో ఇలాంటీ హామీని బీజేపీ ఇవ్వలేదని తేల్చి చెప్పారు. అయితే నల్లధనం పై చర్యలు తీసుకుంటామని చెప్పాము తప్ప ఖాతాల్లో డబ్బులు వేస్తామని చెప్పలేదని అన్నారు.
నల్లధనాన్ని తీసుకువచ్చేందుకు బీజేపీ 'సిట్ 'ను ఏర్పాటు చేసిందని ,ఇందుకు కోసం చర్యలు చేపట్టిందని తెలిపారు. కాగా 2014 ఎన్నికల్లో నల్లధనాన్ని తీసుకురావడం బిజేపికి ఎన్నికల ప్రణాళికలో ఒక ముఖ్యమైన అంశమని అన్నారు. కాగా ప్రతిపక్షపార్టీలు ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ ఇదే అంశంపై తీవ్రంగా మోడీని వ్యతిరేకిస్తుంది.
కాంగ్రెస్ ప్రకటించిన కనీస ఆదాయ పథకం లో భాగంగా మోడీ 15 లక్షలు ప్రతి కుటుంభానికి ఇస్తానని మోసం చేశారని చెబుతూనే కాంగ్రెస్ పార్టీ మోసం చేయదని , ఖచ్చితంగా 72వేల రూపాయలు ప్రతి ఇంటికి ఇస్తామని రాహుల్ గాంధి ప్రచారం చేస్తున్నారు.దీంతో బీజేపీ ఎట్టకేలకు అధికారికంగా ఎన్నికల ముందు కుండ బద్దలు కోట్టింది. దీంతో ఇక కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి .