వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఇప్పుడు నితీష్ కుమార్ పని ఫినిష్: లాలూ ప్రసాద్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు
పాట్నా: గత ఆదివారం శ్రీరామ నవమి నుంచి బీహార్లో పలు జిల్లాల్లో మత ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. పశ్చిమ బెంగాల్లో శాంతియుతంగా రామనవమి ర్యాలీ నిర్వహిస్తున్న వారిపై కొందరు అల్లరి మూకలు దాడి చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇరువర్గాల మధ్య రాళ్ల దాడి చోటు చేసుకుంది.
గత వారం రోజులుగా బీహార్లో పలుచోట్ల మత ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దీనిపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ స్పందించారు. ఇప్పుడు నితీష్ కుమార్ ఫినిష్.. బీహార్లో పలుచోట్ల ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి.. బీజేపీ మండిస్తోంది అని లాలూ ప్రసాద్ అన్నారు.
సీఎం నితీష్ కుమార్ సొంత జిల్లా నలందలో జరిగిన ఘర్షణల్లో ఇరవై మంది వరకు గాయపడ్డారు. ఔరంగాబాద్లో ఘర్షణల నేపథ్యంలో పోలీసులు దాదాపు 150 మందిని అరెస్టు చేసారు. ఘర్షణలపై దర్యాఫ్తు కోసం ప్రభుత్వం రెండు బృందాలను నియమించింది.
lalu prasad yadav nitish kumar bjp bihar rjd jdu లాలూ ప్రసాద్ యాదవ్ నితీష్ కుమార్ బీజేపీ బీహార్ ఆర్జేడీ జేడీయు
English summary
After communal clashes broke out in several areas in Bihar over the past week, RJD chief Lalu Prasad Yadav blamed his former ally and Bihar Chief Minister Nitish Kumar and reportedly said he was “finished”.
Story first published: Thursday, March 29, 2018, 15:11 [IST]