ఢిల్లీ ఎన్నికలు: కాంగ్రెస్ ఓటు షేరును పెంచుకుని బీజేపీ నెత్తిన పాలు పోస్తుందా..?
ఢిల్లీ: ఢిల్లీ ఎన్నికలు ఆసక్తిని రేకిస్తున్నాయి. అక్కడ త్రిముఖ పోటీ నెలకొనడంతో దేశం ఢిల్లీ ఎన్నికలపై దృష్టి సారించారు. వరుస పరాజయాలు బీజేపీని వెంటాడుతుండగా ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి ఏంటా అనేది దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. బీజేపీకి ఉన్న ఓటు బ్యాంకు స్థిరంగానే ఉండగా కాంగ్రెస్ ఓటు బ్యాంకును ఆమ్ఆద్మీ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లగొట్టింది. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటు బ్యాంకు మొత్తం ఆమ్ ఆద్మీ పార్టీ వైపు మరలింది. ఫలితంగా కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ నగరంలో ఒక్క సీటుకూడా దక్కలేదు. 1998 నుంచి 15 ఏళ్ల పాటు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్ పార్టీకి అది ఘోర అవమానమే అని చెప్పాలి.
కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి ఆమ్ఆద్మీ పార్టీ
ప్రస్తుతం
జరగనున్న
అసెంబ్లీ
ఎన్నికల్లో
ఆమ్
ఆద్మీ
పార్టీ
ఓట్ల
కోసమే
కాంగ్రెస్
కృషి
చేస్తుండటంతో
తన
ప్రధాన
ప్రత్యర్థి
ఆమ్ఆద్మీ
పార్టీనే
అని
కాంగ్రెస్
వర్గాలు
చెబుతున్నాయి.
అయితే
గత
ఐదారేళ్లుగా
ఆమ్
ఆద్మీ
పార్టీ
తన
ఓటు
బ్యాంకును
పటిష్టం
చేసుకుంది.
కాంగ్రెస్
మాత్రం
అంతర్గత
విబేధాలు,
సీనియర్
నాయకుల
వ్యక్తిగత
లాభాల
కోసం
పాకులాడింది.
ఈ
క్రమంలోనే
ఢిల్లీ
ఎన్నికల్లో
పోటీచేసేందుకు
కాంగ్రెస్
నేతలు
చాలా
మంది
వెనకడుగు
వేశారు.
ఇదిలా
ఉంటే
బీజేపీ
మాత్రం
కాంగ్రెస్
ఆప్
మధ్య
గొడవను
చాలా
దగ్గరగా
పరిశీలిస్తోంది.
కాంగ్రెస్
పార్టీ
తన
ఓటుషేరును
పెంచుకోగలిగితే
అది
బీజేపీకే
లాభం
అని
ఆ
పార్టీ
నేతలు
చెబుతున్నారు.
ఓటు
షేరు
పెంచుకోవడం
వల్ల
కేజ్రీవాల్
పార్టీ
బలం
తగ్గిపోతుందని
వారు
అంచనా
వేస్తున్నారు.
2015లో ఒక్క ఢిల్లీలో ఖాతా తెరవని కాంగ్రెస్
2013
ఎన్నికల్లో
ఆప్
28
సీట్లను
కైవసం
చేసుకుని
కింగ్
మేకర్గా
అవతరించింది.
29.49శాతం
ఓట్లు
వచ్చాయి.
2015లో
ఏకంగా
67
సీట్లు
గెల్చుకుంది.
ఆ
సమయంలో
54.3
శాతం
ఓట్లు
లభించాయి.
2013లో
కాంగ్రెస్
8
సీట్లు
సాధించి
24.55శాతం
ఓటు
శాతం
దక్కించుకుంది.
అదే
2015లో
9.8శాతం
ఓట్లు
మాత్రమే
వచ్చాయి.
ఒక్క
సీటు
కూడా
గెల్చుకోకపోవడం
విశేషం.
మరోవైపు
2013లో
బీజేపీ
31
స్థానాల్లో
విజయం
సాధించగా
33.07శాతం
ఓట్లు
సంపాదించింది.
2015కు
ఒక్క
శాతం
ఓట్లు
తగ్గి
32.1శాతం
వద్ద
నిలిచి
మూడు
సీట్లు
కైవసం
చేసుకుంది.
ముస్లిం సామాజిక వర్గం తమవైపే ఉంటారన్న ధీమా
ఇక ఫ్రిబవరి 8న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటు షేరును అలానే సీట్లను కూడా పెంచుకునేందుకు తీవ్ర కసరత్తు చేస్తోంది. పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీలపై కాంగ్రెస్ చేస్తున్న పోరాటం ముస్లిం సామాజిక ఓటర్లను ఆకట్టుకుందని వారిలోకి చొచ్చుకుపోయిందనే విశ్వాసంను హస్తం పార్టీ వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే వారి ఓట్లు కాంగ్రెస్కు తప్ప మరో పార్టీకి వెళ్లవనే ధీమాతో ఉంది. అంతేకాదు ఆర్జేడీతో జట్టు కట్టడం వల్ల ఢిల్లీలో సెటిల్ అయిన బీహారీల ఓట్లు కూడా వస్తాయని కనీసం 4-5 స్థానాల్లో వారి ప్రభావం ఉంటుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ తరపున స్టార్ క్యాంపెయినర్లు ప్రచారం చేస్తున్నారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీలు ఢిల్లీలో ప్రచారం నిర్వహించనుండగా.. నవజ్యోత్ సింగ్ సిద్ధూ, ఖుష్బూ, నగ్మా, మొరార్జీలు కూడా ప్రచారం నిర్వహించనున్నారు.