విజయకాంత్, రజనీకాంత్లను దువ్వుతున్న బిజెపి
దక్షిణాదిన కూడా పట్టు పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్కు కూడా బిజెపి గాలం వేస్తున్నట్లుగా గతంలో వార్తలు వచ్చాయి. శనివారం తమిళనాడులోని తిరుచ్చిలో భారతీయ జనతా పార్టీ లోకసభ ఎన్నికల కార్యాచరణ సంఘం సమావేశమైంది. ఈ సమావేశానికి జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు అధ్యక్షత వహించారు.
అనంతరం పోన్ రాధాకృష్ణ విలేకరులతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా మోడీ హవా వీస్తోందన్నారు. ఆ ప్రభావం తమిళనాడులోని బలంగా ఉందన్నారు. బిజెపి తన బలాన్ని పెంచుకొని కేంద్రంలోను, రాష్ట్రంలోను అధఇకారం చేపట్టనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తమిళనాడులో ఇతర పార్టీలతో కూటమికి ప్రయత్నిస్తున్నామన్నారు.
ఇప్పటికే ఎండిఎంకెతో చర్చలు ముగిశాయని, విజయకాంత్ నేతృత్వంలోని డిఎండికెతో చర్చిస్తున్నట్లు చెప్పారు. సూపర్ స్టార్ రజనీకాంత్ వంటి ప్రముఖుల మద్దతు కోరుతామని రాధాకృష్ణ చెప్పారు. విజయకాంత్ బిజెపితో కలిసి నడుస్తారని భావిస్తున్నామన్నారు. విజయకాంత్ సరైన నిర్ణయం తీసుకుంటారనుకుంటున్నామని రాధాకృష్ణ అన్నారు.