భారతీయ రైల్వేలో ఇంకా అచ్చే దిన్ రాలేదు: బీజేపీ సీనియర్ నేత లక్ష్మీకాంత చావ్లా
భారతీయ రైల్వేలో అచ్చేదిన్ ఇంకా రాలేదు. ఈ మాటలు అన్నది ఎవరో కాదు... బీజేపీ సీనియర్ మహిళా నేత లక్ష్మీకాంత చావ్లా. ఇక వివరాల్లోకెళితే... లక్ష్మీకాంత చావ్లా ఓ రైల్వే స్టేషన్లో తాను ఎక్కాల్సిన రైలు కోసం వేచి ఉన్నారు. ఇలా నిమిషాల పాటు కాదు.. గంటలపాటు. ఆమె ఎక్కాల్సిన రైలు వచ్చింది. చేరాల్సిన గమ్యస్థానం 9 గంటల పాటు ఆలస్యం అయ్యింది. ఆమె సహనం కోల్పోయారు. "ప్రధానిగారు బుల్లెట్ రైలు సంగతి తరువాత ముందుగా సాధారణ రైళ్లపై దృష్టి సారించండి " అంటూ తాను పోస్టు చేసిన వీడియోలో చెప్పారు.
లక్ష్మీ కాంత చావ్లా అమృత్సర్ నుంచి అయోధ్యకు వెళ్లేందుకు రైల్వే స్టేషన్లో వేచి చూశారు. రైలు వచ్చింది. ఆమె ఎక్కారు. కానీ చేరాల్సిన గమ్యస్థానం సాధారణ సమయంకంటే 9 గంటలు ఆలస్యంగా చేరుకుంది. అంతేకాదు రైలులో ఆకలి వేయగా... తినేందుకు ఆహార పదార్థాలు కూడా లేవని ఆమె మండిపడ్డారు.
Senior @BJP4India leader from Amritsar Laxmi Kanta Chawla tells @narendramodi & @PiyushGoyal to "forget" about #bullettrain and instead focus on those already running.
— Chitleen K Sethi (@ChitleenKSethi) December 24, 2018
She made this video aboard the Saryu-Yamuna train which was delayed by 14 hours.
Part 1 of the video: pic.twitter.com/dC0ZEyk1ge
శతాబ్ది లాంటి సూపర్ ఫాస్ట్ ట్రైన్లు అభివృద్ధి చెందాయి కానీ సామాన్యుడు ప్రయాణం చేసే ఎక్స్ప్రెస్ రైళ్లలో మాత్రం ఎలాంటి అభివృద్ధి చెందలేదని చెప్పారు. అంతేకాదు తాను ప్రయాణించిన సరయు-యమున ఎక్స్ప్రెస్ 9 గంటలపాటు ఆలస్యం అయ్యిందని ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఆమె ప్రధాని స్థాయి నుంచి రైల్వే మంత్రివరకు ప్రతి ఒక్కరిని విమర్శించారు.
"వాతావరణం చల్లగా ఉంది.. అసలే చలికాలం. చాలామంది రైలు కోసం వేచి చూస్తూ రైల్వే ప్లాట్ ఫాంపైనే కూర్చుని ఉన్నారు. టీవీ స్క్రీన్లపై వస్తున్న రైల్వే హెల్ప్లైన్కు ఫోన్ చేశాము. కానీ అక్కడి నుంచి ఎలాంటి స్పందన రాలేదు." అని చావ్లా వీడియోలో రికార్డు చేసి ట్వీట్ చేశారు.