కశ్మీర్లో కాల్పుల మోత, బీజేపీ నేత, తండ్రి, సోదరుడు మృతి.. సెక్యూరిటీ గార్డ్స్ అరెస్ట్..
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఈ సారి బీజేపీ నేత లక్ష్యంగా కాల్పులు జరిపారు. కాల్పుల్లో నేత సహా అతని తండ్రి, సోదరుడు కూడా చనిపోయాడు. బుధవారం రాత్రి బందిపోర కాల్పులతో దద్దరిల్లగా.. మూడు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. కాల్పులతో బందిపోర ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
బందిపోర జిల్లా అధ్యక్షుడు వసీమ్ బరీకి పీఎస్ సమీపంలో షాపు ఉంది. అందులో అతను సహా తండ్రి బషీర్ అహ్మద్, సోదరుడు ఉమర్ ఉంటారు. అయితే వసీమ్ను మిలిటెంట్లు లక్ష్యం చేసుకున్నారు. రాత్రి 9 గంటల సమయంలో కాల్పులతో విరుచుకుపడ్డారు. వాస్తవానికి వసీమ్కు 10 మంది సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. కానీ వారు ఎదురు కాల్పులు జరపలేదు. కాల్పుల్లో వసీమ్ అక్కడికక్కడే నెలకొరగగా.. అతని తండ్రి, సోదరుడు ఆస్పత్రికి తీసుకెళ్లగా చనిపోయారు.
Recommended Video
కాల్పుల ఘటనను బీజేపీ నేత రాం మాధవ్ ఖండించారు. ఫైరింగ్ జరపడంతో ముగ్గురు చనిపోయారని తెలిసి షాక్ నకు గురయ్యానని తెలిపారు. ఘటనపై మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా ఖండించారు. మృతుల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.