వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కశ్మీర్‌లో కాల్పుల మోత, బీజేపీ నేత, తండ్రి, సోదరుడు మృతి.. సెక్యూరిటీ గార్డ్స్ అరెస్ట్..

|
Google Oneindia TeluguNews

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఈ సారి బీజేపీ నేత లక్ష్యంగా కాల్పులు జరిపారు. కాల్పుల్లో నేత సహా అతని తండ్రి, సోదరుడు కూడా చనిపోయాడు. బుధవారం రాత్రి బందిపోర కాల్పులతో దద్దరిల్లగా.. మూడు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. కాల్పులతో బందిపోర ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

బందిపోర జిల్లా అధ్యక్షుడు వసీమ్ బరీకి పీఎస్ సమీపంలో షాపు ఉంది. అందులో అతను సహా తండ్రి బషీర్ అహ్మద్, సోదరుడు ఉమర్ ఉంటారు. అయితే వసీమ్‌ను మిలిటెంట్లు లక్ష్యం చేసుకున్నారు. రాత్రి 9 గంటల సమయంలో కాల్పులతో విరుచుకుపడ్డారు. వాస్తవానికి వసీమ్‌కు 10 మంది సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. కానీ వారు ఎదురు కాల్పులు జరపలేదు. కాల్పుల్లో వసీమ్ అక్కడికక్కడే నెలకొరగగా.. అతని తండ్రి, సోదరుడు ఆస్పత్రికి తీసుకెళ్లగా చనిపోయారు.

BJP Leader, His Father & Brother Shot Dead by Militants..

Recommended Video

YSR 71st Birth Anniversary: ప్రజల గుండెల్లో మహానేత, వైఎస్ రాజశేఖర్ రెడ్డికి కాంగ్రెస్ నాయకుల నివాళి

కాల్పుల ఘటనను బీజేపీ నేత రాం మాధవ్ ఖండించారు. ఫైరింగ్ జరపడంతో ముగ్గురు చనిపోయారని తెలిసి షాక్ నకు గురయ్యానని తెలిపారు. ఘటనపై మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా ఖండించారు. మృతుల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

English summary
BJP leader and two members of his family were killed on Wednesday night after militants opened fire at them in Jammu and Kashmir's Bandipora district
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X