గుజరాత్లో బీజేపీ గెలుపుపై మమతా బెనర్జీ
కోల్కతా: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో బీజేపీ గెలుపుపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం స్పందించారు. సమతూకంగా తీర్పునిచ్చిన గుజరాత్ ఓటర్లకు అభినందనలు తెలుపుతున్నానని చెప్పారు.
బీజేపీని మోడీ కాపాడిన రోజు! ఎలా అంటే? కాంగ్రెస్ కంటే అదే పెద్ద ఛాలెంజ్, నెగ్గారు
గుజరాత్లో బీజేపీది తాత్కాలిక విజయమని ఆమె పేర్కొన్నారు. అవినీతి, అన్యాయం, కుల వివక్షకు వ్యతిరేకంగా ప్రజలు ఓటేశారని చెప్పారు. బీజేపీ గెలిచినప్పటికీ నైతికంగా ఓటమి చవిచూసినట్లే అన్నారు.
బీజేపీ 'భారీ' విజయానికి అడ్డు ఇవే, చివరి నిమిషంలో.. గెలుపుకు కారణాలు
ఈ మేరకు మమతా బెనర్జీ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో స్పందించారు. కాగా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో బీజేపీ విజయం సాధించిన విషయం తెలిసిందే.
బీజేపీకి గుజరాత్ బ్రాండ్ అంబాసిడర్గా మారింది. 22 ఏళ్ల పాటు గుజరాత్లో అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి అధికార పగ్గాలు చేపడుతోంది. 57 ఏళ్ల గుజరాత్ చరిత్రలో వరుసగా 22 ఏళ్ల పాటు అధికారంలో ఉండి, అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం అంత తేలికైన విషయం కాదు.