ఏడు రోజుల్లో 3 లక్షల ఎలుకలను చంపారా: మంత్రి మాట ఇదీ
Recommended Video
ముంబై: మంత్రాలయలో ఏడు రోజుల్లో 3 లక్షల ఎలుకలను చంపారనే ఆరోపణపై వివాదం చెలరేగుతోంది. ఆ వివాదంపై బిజెపి మంత్రి రామ్ కదం వివరణ ఇచ్చారు. 3,19,400 అనే సంఖ్య మాత్రలకు సంబంధించిందని, ఎలుకలను చంపింది కాదని స్పష్టం చేశారు.
3,19,400 అనేది ఎలుకలను చంపే మాత్రలను చెప్పిన సంఖ్య అని ఆన చెప్పారు. ఎలుకలను లెక్కించడానికి యంత్రమేదీ లేదని కూడా చెప్పారు. రోజుకు 45 వేల ఎలుకలను చంపుతున్నారనే ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని అన్నారు
ఎలుకలను చంపే ఆ మాత్రలను ఒక్కొక్కటి రూ.1.50 చొప్పున 2010-11 కొన్నట్లు తెలిపారు. మంత్రాలయలో ఎలుకలను చంపడానికి ఇచ్చిన కాంట్రాక్టుపైవిచారణ జరిపించాలని సీనియర్ బిజెపి నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి ఏక్నాథ్ ఖడ్సే డిమాండ్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ఏడు రోజుల్లో 3,19,400 ఎలుకలను కంపెనీ ఎలా చంపగలిగిందని ఆయన శాసనసభలో అడిగారు. మంత్రాలయలో 3,19,400 ఎలుకలున్నాయని సర్వేలో తెలిందని, సాధారణ పరిపాలన శాఖ వర్క్ ఆర్డర్ జారీ చేసిందని, కంపెనీకి ఆరు నెలల సమయం ఇచ్చారని, అయితే ఏడు రోజుల్లో ఆ ఎలుకలను చంపినట్లు తెలిపిందని ఆయన చెప్పారు.