రాహుల్ గాంధీ పిచ్చోడు, బుద్ది ఉందో లేదో తెలీదు, ప్రధాని అవుతాడా, బీజేపీ ఎమ్మెల్యే!
Recommended Video
బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి హాఫ్ మెంటల్ (అర్దం పిచ్చోడు) ఉందని, అతను ఏం మాట్లాడుతాడో ఆ పార్టీ నాయకులకే అర్థం కాదని, అలాంటి వ్యక్తి ప్రధాని అవుతాడా ? అని కర్ణాటక బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ విరుచుకుపడ్డారు.
కర్ణాటకలోని విజయపుర జిల్లా ముద్దేబీహాళలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల మీద విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీని ఏకవచనంతో విమర్శించిన బసనగౌడ పాటిల్ యత్నాల్ పనిలో పనిగా మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ మీద విరుచుకుపడ్డారు.
రాహుల్ గాంధీకి హాఫ్ మెంటల్ ఉందని, అతనికి బుద్ది ఉందో లేదో ఎవరికీ తెలియడం లేదని బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ విమర్శించారు. విదేశాలకు వెళ్లి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్న రాహుల్ గాంధీని తాము ప్రధానిని చేస్తాం అంటూ ఇక్కడ కాంగ్రెస్ నాయకులు తిరుగుతున్నారని ఎద్దేవ చేశారు.
మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయి గురించి మాట్లాడే నైతిక హక్కు రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి లేదని బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ అన్నారు. అటల్ బిహారి వాజ్ పేయి చివరి కోరిక నదులు అనుసందానం చెయ్యడం అని బసనగౌడ పాటిల్ యత్నాల్ గుర్తు చేశారు.
మాజీ ప్రధాని, జేడీఎస్ చీఫ్ హెచ్.డి. దేవేగౌడకు ఒక ఆశ ఉందని బసనగౌడ పాటిల్ యత్నాల్ అన్నారు. దేవేగౌడ చివరి ఆశ కుమారుడు హెచ్.డి. కుమారస్వామిని సీఎం చెయ్యడం, మరో కుమారుడు హెచ్.డి. రేవణ్ణకు పీడబ్ల్యూ శాఖ అప్పగించడం అని బసనగౌడ పాటిల్ యత్నాల్ ఆరోపించారు.
ఇద్దరు కుమారులు అధికారంలో ఉండటం, డీసీ. తమ్మణ్ణ, పుట్టరాజు తదితర బంధువులు మంత్రులు కావడం, ఒక్కలిగులు అందరికీ మంత్రి పదవులు ఇచ్చి కుటుంబం మొత్తం కమీషన్లు తీసుకుంటూ కాలం గడపడం మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ ఆశయం అని బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ ఆరోపించారు. ఇదే సందర్బంలో కాంగ్రెస్, జేడీఎస్ నాయకుల మీద బసనగౌడ పాటిల్ యత్నాల్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.