వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీలో విషాదం: ఒకే రోజు ఇద్దరు ఎమ్మెల్యేల మృతి

|
Google Oneindia TeluguNews

Recommended Video

బీజేపీలో విషాదం: ఒకే రోజు ఇద్దరు ఎమ్మెల్యేల మృతి

జైపూర్/లక్నో: ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ భారతీయ జనతా పార్టీ శాఖల్లో విషాదం నెలకొంది. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ బీజేపీ ఎమ్మెల్యే మరణించగా, దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న రాజస్థాన్ ఎమ్మెల్యే కన్నుమూశారు.

ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే లోకేంద్ర సింగ్, రాజస్థాన్‌లో కళ్యాణ్ సింగ్ అనే మరో బీజేపీ ఎమ్మెల్యేలు బుధవారం ఉదయం మృతి చెందారు. వీరి మృతి పట్ల బీజేపీ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు.

bjp mla from bijnor noorpur lokendra singh died in a road accident and kalyan singh died deu to prolonged illness

వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే లోకేంద్ర సింగ్‌ బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. సీతాపూర్‌లో ఆయన ప్రయాణిస్తున్న కారు ట్రక్‌ను ఢీకొనడంతో ఎమ్మల్యేతో పాటు ఆయన సెక్యూరిటీ గార్డులు ఇద్దరు మరణించారు.

ప్రమాదంలో ట్రక్కు డ్రైవర్‌ కూడా మరణించారు. ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు ఎమ్మెల్యే, గన్‌మెన్ల మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. బిజ్నూర్‌ జిల్లా నూర్పూర్‌ నియోజకవర్గం నుంచి ఆయన యూపీ అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2012లో నూర్పూర్‌ నుంచి గెలుపొందిన సింగ్‌ 2017లో తిరిగి అదే స్ధానం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

మరో ఘటనలో రాజస్థాన్‌ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే, సీనియర్ నేత కళ్యాణ్ సింగ్ దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతూ బుధవారం ఉదయం మృత్యువాత పడ్డారు. బీజేపీలో కీలక నేతగా వ్యవహరించిన కళ్యాణ్ సింగ్ మరణంతో ఆ రాష్ట్ర బీజేపీ శాఖలో విషాదం నెలకొంది.

English summary
bjp mla from bijnor noorpur lokendra singh in road accident and kalyan singh died from prolonged illness.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X