హిందువుల ఆస్తులు ముస్లీంలు కొనకుండా యాక్ట్ చేయాలి: బిజెపి ఎమ్మెల్యే
హిందువుల ఆస్తులు ముస్లిములు కొనకుండా డీఏ యాక్టు ప్రయోగించాలని బిజెపికి చెందిన ఓ మహిళా ఎమ్మెల్యే జిల్లా కలెక్టరుకు లేఖ రాసి సంచలనం సృష్టించారు.
సూరత్: హిందువుల ఆస్తులు ముస్లిములు కొనకుండా డీఏ యాక్టు ప్రయోగించాలని బిజెపికి చెందిన ఓ మహిళా ఎమ్మెల్యే జిల్లా కలెక్టరుకు లేఖ రాసి సంచలనం సృష్టించారు.
సూరత్ నగరం పరిధిలోని లింబాయత్ అసెంబ్లీ నియోజకవర్గంలో హిందువుల ఆస్తులను ముస్లిములు కొనకుండా డిస్ట్రబ్డ్ యాక్టును ప్రయోగించాలని బిజెపి ఎమ్మెల్యే సంగీతా పాటిల్ కోరారు.
ఈ మేరకు సంగీత పాటిల్ సూరత్ జిల్లా కలెక్టరుకు లేఖ రాశారు. ఒక మతం వారు నివాసముంటున్న ప్రాంతాల్లో మరో మతానికి చెందిన వారు జిల్లా కలెక్టరు అనుమతి లేకుండా ఇళ్లు, ఆస్తులు కొనడాన్ని డిస్ట్రబ్డ్ యాక్టు 1991 కింద నిషేధించాలని డిమాండ్ చేశారు.
లింబాయత్ నియోజకవర్గంలోని గోవింద్ నగర్, భారతీనగర్, మదన్ పురా, భావనపార్కు లాంటి హిందూ పేర్లున్న ప్రాంతాల్లో ముస్లిములు హిందువులను బెదిరించి ఇళ్లు కొనుగోలు చేస్తున్నారని సంగీత కలెక్టరుకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
హిందువుల ఇళ్లకు ముస్లింలు అధిక ధరలు చెల్లిస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. ఇదిలా ఉండగా, ఎమ్మెల్యే సంగీత మతకలహాలు ప్రేరేపించేలా ప్రవర్తిస్తున్నారని సూరత్ కాంగ్రెస్ నాయకుడు అస్లాం విమర్శించారు.