బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగర్పై హత్యయత్నం కేసు నమోదు చేసిన సీబీఐ
ఎట్టకేలకు ఉన్నావో అత్యచార బాధితురాలి కారు ప్రమాదానికి కారణమని ఆరోపణలు రావడంతో ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించింది. దీంతో విచారణ చేపట్టిన సిబిఐ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్పై కేసును నమోదు చేసింది.కాగా ఇప్పటికే అత్యాచారం కేసులో సిబిఐ ఎమ్మెల్యేపై చార్జీషీట్ ధాఖలు చేయడంతో ఆయన గత ఎప్రిల్ 13 నుండి జైల్లో ఉన్నాడు. కాగ మరోసారి బాధితురాలిని ప్రమాదానికి గురి చేసి హత్య చేయాలని కుట్రపన్నినట్టు పలు ఆరోపణలు వెల్లువెత్తాయి.
కాగా కేసును చేధించేందుకు ప్రత్యేక సిబిఐ బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో కేసును త్వరగా పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశించడంతో ప్రమాదం జరిగిన ప్రాంతంలో సిబిఐ బృందం పర్యటించింది. అనంతరం ప్రమాద సంఘటనకు గల కారణాలను విచారించిన అనంతరం ఎమ్మెల్యేపై కేసును నమోదు చేసింది.
మరోవైపు ప్రమాదంతో పాటు అత్యాచారంపై కూడ సుప్రిం కోర్టు కూడ గురువారం విచారణ చేపట్టనుండడంతో ప్రభుత్వం దిగివచ్చి సిబిఐ విచారణ చేపట్టింది. ఈనేపథ్యంలోనే కేసు స్టేటస్పై కూడ రిపోర్టును అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే కేసుకు సంబంధించి ప్రభుత్వం విచారణను వేగవంతం చేసింది.