బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు: పెరుగుతున్న ముస్లిం జనాభాతోనే దేశంలో అత్యాచారాలు హత్యలు
ఉత్తర్ ప్రదేశ్ : వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్గా మారుతున్నారు బీజేపీ ప్రజాప్రతినిధులు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ ఎంపీ హరిఓం పాండే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్లో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన జనాభా పెరిగిపోతుండటం వల్లే అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయని అన్నారు. ఈ సంఖ్య గణనీయంగా పెరిగిపోతోందని చెప్పారు. అంతేకాదు త్వరలో భారత్ నుంచి పాకిస్తాన్లా మరో దేశం ఆవిర్భవిస్తుందని పాండే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
అంబేద్కర్ నగర్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న పాండే.. ప్రభుత్వం ముస్లిం జనాభా పెరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. " ఉగ్రవాదం, అత్యాచారాలు, లైంగిక వేధింపులు భారత్లోనే జరుగుతున్నాయంటే ఇందకు కారణం పెరుగుతున్న ముస్లిం జనాభానే. భారత్కు స్వాతంత్ర్యం సిద్ధించిన నాటి నుంచి ముస్లిం సామాజిక వర్గానికి చెందిన జనాభాలో మాత్రమే పెరుగుదల కనిపిస్తోంది" అని హరిఓం పాండే అన్నారు. జనాభా పెరుగుదలతో ఉపాధి కల్పించలేని పరిస్థితి ఉత్పన్నమవుతుందన్న ఎంపీ... ఆర్థిక వ్యవస్థ కూడా కుప్పకూలే ప్రమాదం ఉందన్నారు.

ముస్లిం జనాభాను నియంత్రించేందుకు త్వరలోనే పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టాలని హరిఓం పాండే అన్నారు. భారత్ మళ్లీ రెండు దేశాలుగా విడిపోకముందే ఈ బిల్లును పార్లమెంటులో పెట్టి చట్టం చేయాలని హరిఓం పాండే సూచించారు.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్












Click it and Unblock the Notifications