షాకింగ్: బీజేపీ ఎంపీ కాళ్లు కడిగి, ఆ నీరు తాగిన కార్యకర్త, ఎందుకంటే? (వీడియో)
Recommended Video
న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే వివాదంలో చిక్కుకున్నారు. ఆయన పాదాలను ఓ కార్యకర్త కడిగారు. దీనిపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో విషయం వెలుగు చూసింది.
ఇందులో పవన్ షా అనే బీజేపీ కార్యకర్త.. సదరు ఎంపీ కాళ్లు కడిగి, ఆ నీళ్లను తాగారు. ఈ సంఘటన జార్ఖండ్లోని కనహ్వారా గ్రామంలో చోటు చేసుకుంది. ఎంపీ ఓ బ్రిడ్జి నిర్మాణ పనుల విషయమై గ్రామానికి వచ్చారు. ఈ సమయంలో ఎంపీని ప్రసన్నం చేసుకునేందుకు కార్యకర్త తాంబాలంలో పాదాలు కడిగి నీళ్లు తాగాడు. నేతలను ప్రసన్నం చేసుకునేందుకు కిందిస్థాయి కార్యకర్తలు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తారు. ఇది మాత్రం అందర్నీ విస్తుగొలుపుతోంది.
ఈ సంఘటన సభా వేదిక పైనే జరిగింది. అందరు చూస్తుండగానే ఈ ఘటన జరిగింది. పాదాలను కడగి, ఆ నీటిని తాగి, ఆ తర్వాత తలపై చల్లుకున్నాడు. అతని ప్రవర్తన చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కాగా, వీడియోను చూస్తుంటే.. సదరు ఎంపీ వద్దు.. వద్దు అన్నట్లుగా ఉంది. ఈ ఘనటపై ఎంపీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
#WATCH BJP worker washes feet of BJP Godda MP Nishikant Dubey and drinks that water, at an event in Jharkhand's Godda (16.09.18) pic.twitter.com/J2YwazQDhg
— ANI (@ANI) September 17, 2018