వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్: బీజేపీ ఎంపీ కాళ్లు కడిగి, ఆ నీరు తాగిన కార్యకర్త, ఎందుకంటే? (వీడియో)

|
Google Oneindia TeluguNews

Recommended Video

బీజేపీ ఎంపీ కాళ్లు కడిగి, ఆ నీరు తాగిన కార్యకర్త, ఎందుకంటే?

న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే వివాదంలో చిక్కుకున్నారు. ఆయన పాదాలను ఓ కార్యకర్త కడిగారు. దీనిపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో విషయం వెలుగు చూసింది.

ఇందులో పవన్ షా అనే బీజేపీ కార్యకర్త.. సదరు ఎంపీ కాళ్లు కడిగి, ఆ నీళ్లను తాగారు. ఈ సంఘటన జార్ఖండ్‌లోని కనహ్వారా గ్రామంలో చోటు చేసుకుంది. ఎంపీ ఓ బ్రిడ్జి నిర్మాణ పనుల విషయమై గ్రామానికి వచ్చారు. ఈ సమయంలో ఎంపీని ప్రసన్నం చేసుకునేందుకు కార్యకర్త తాంబాలంలో పాదాలు కడిగి నీళ్లు తాగాడు. నేతలను ప్రసన్నం చేసుకునేందుకు కిందిస్థాయి కార్యకర్తలు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తారు. ఇది మాత్రం అందర్నీ విస్తుగొలుపుతోంది.

BJP MP Nishikant Dubey Slammed for Allowing Party Worker to Wash His Feet and Drink Up the Water

ఈ సంఘటన సభా వేదిక పైనే జరిగింది. అందరు చూస్తుండగానే ఈ ఘటన జరిగింది. పాదాలను కడగి, ఆ నీటిని తాగి, ఆ తర్వాత తలపై చల్లుకున్నాడు. అతని ప్రవర్తన చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కాగా, వీడియోను చూస్తుంటే.. సదరు ఎంపీ వద్దు.. వద్దు అన్నట్లుగా ఉంది. ఈ ఘనటపై ఎంపీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

English summary
Godda BJP MP Nishikant Dubey has landed himself in controversy for allowing a party worker to wash his feet and then drink the water that was used for washing the feet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X