గుజరాత్ ఎన్నికలు, బీజేపీ మూడో జాబితా, మంత్రితో సహ 12 మంది సిట్టింగ్ లకులు నో చాన్స్ !
గుజరాత్ లో అధికారంలో ఉన్న బీజేపీ శాసన సభ ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. గుజరాత్ శాసన సభ ఎన్నికలు 2017ను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం చాలెంజ్ గా తీసుకుంటున్నారు.
Recommended Video
అహ్మదాబాద్: గుజరాత్ లో అధికారంలో ఉన్న బీజేపీ శాసన సభ ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. గుజరాత్ శాసన సభ ఎన్నికలు 2017ను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం చాలెంజ్ గా తీసుకుంటున్నారు.
సోమవారం గుజరాత్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారి మూడో జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఇప్పటికే రెండు విడతలుగా బీజేపీ శాసన సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్లను విడుదల చేసింది. సోమవారం మూడో జాబితాలో 28 మంది అభ్యర్థుల పేర్లు విడుదల చేసింది.
మూడు జాబితా బయటకు రావడడంతో కొన్ని వర్గాలు సంతోషం, కొన్ని వర్గాల్లో అసంతృప్తి వ్యక్తం అయ్యింది. శనివారం గుజరాత్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 36 మంది అభ్యర్థుల రెండో జాబితాను బీజేపీ విడుదల చేసింది. అందులో ఓ మంత్రితో సహ 12 మంది ఎమ్మెల్యేలు మళ్లీ పోటీ చెయ్యడానికి నికారించిన అధిష్టానం కొత్త వారికి అవకాశం ఇచ్చింది.
గుజరాత్ లో 182 శాసన సభ నియోజక వర్గాల్లో డిసెంబర్ 9, 14వ తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే బీజేపీ 134 స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్లు ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ 77 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించింది. పోటీ చెయ్యడానికి అవకాశం చిక్కకపోవడంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలలో అసమ్మతి నేతులు ఎక్కువ అవుతున్నారు.