రాహుల్పై చర్యలు తీసుకోండి, బెంగాల్ను అత్యంత సున్నిత రాష్ట్రంగా ప్రకటించండి: ఈసీకి బీజేపీ
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి రవిశంకర ప్రసాద్ బుధవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. ఈ మేరకు బెంగాల్లోని పరిస్థితిపై, అలాగే ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీపై ఫిర్యాదు చేశారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన సభలో ప్రధాని నరేంద్ర మోడీపై అర్థంపర్థం లేని ఆరోపణలు చేశారని, ఈ అంశంపై రాహుల్ గాంధీపై ఫిర్యాదు చేశామన్నారు.
మోడీ కారణజన్ముడా, ప్రముఖులకు ఓటమి తప్పదా?: జ్యోతిష్య పండితులు ఏం చెబుతున్నారంటే?
అలాంటి ఆరోపణలు చేసినందుకు రాహుల్ పైన సరైన చర్యలు తీసుకోవాలని తాము ఈసీని కోరామని చెప్పారు. షెడ్యూల్ ప్రకటించిన వెంటనే కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులోకి వస్తుందని, ఇలాంటి సమయంలోను అనుచిత ఆరోపణలు చేశారని చెప్పారు.
అలాగే, పశ్చిమ బెంగాల్ను అత్యంత సున్నితమైన రాష్ట్రంగా గుర్తించాలని తాము ఈసీకి విన్నవించామని చెప్పారు. అలాగే పశ్చిమ బెంగాల్లోని అన్ని పోలింగ్ బూత్లలో కేంద్ర బలగాలను దింపేందుకు అవకాశమివ్వాలని కోరినట్లు తెలిపారు.