ముంబైలో మాంసం నిషేధం: గడ్డి తినాలని ట్వీట్లు
ముంబై: బృహాణ్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)లో మాంసం విక్రయాలు నాలుగు రోజుల పాటు నిషేధించాలని అధికారంలో ఉన్న బీజేపీ నిర్ణయించింది. ఈ విషయంలో ఆర్ఎస్ఎస్ నాయకులు బీజేపీతో విభేదించారు. ఎవరు ఏమి తినాలో చెప్పడానికి మీరెవరు అని ప్రశ్నించారు.
ఆర్ఎస్ఎస్ నేత సంజయ్ రావత్ మాట్లాడుతూ ఎవరు ఏమి తినాలో చెప్పే హక్కు ఎవ్వరికి లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశంలో 85 శాతం మంది మాంసాహారులే ఉన్నారని అన్నారు. ఈ నిర్ణయంపై బీఎంసీలో తిర్మానం ప్రవేశ పెట్టినా మద్దతుగా కేవలం 29 ఓట్లు మాత్రమే వచ్చాయని గుర్తు చేశారు.
జైనులు పవిత్రంగా ఉపవాసం ఉండే పర్యుషాన్ (అహింసతో కూడిన దీక్ష) నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా ముంబై నగరంలో ఈనెల 10, 13, 17, 18వ తేదిల్లో పూర్తిగా మాంసం విక్రయించరాదని బీజేపీ నేత దినేష్ జైన్ మీరా భయందర్ మున్సిపల్ కార్పొరేషన్ లో నిర్ణయం తీసుకున్నారు. మాంసం విక్రయించరాదని తీసుకున్న నిర్ణయంపై సోషల్ మీడియాలో పలువురు వివిధ రకాలుగా స్పందించారు.
నిషేధం
ముంబై నగరంలోని అన్ని ప్రాంతాలలో నాలుగు రోజుల పాటు మాంసం విక్రయాలు నిషేధించారు.
బ్యాన్ రాజధాని
బీఫ్ బ్యాన్, మాంసం బ్యాన్, ముంబైలో అన్ని బ్యాన్, భారత్ బ్యాన్ రాజధాని ముంబై
పనులు వదిలి అన్ని బ్యాన్
ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించండి. తరువాత నిషేధాల గురించి అలోచించండి
మాంసం ఉండదు
ఫుడ్ ఫెస్టివల్ లో ఈ సంవత్సరం మాంసాహారం ఉండదు. కేవలం చెన్నా మసాల మాత్రమే ఉంటుంది.
ఒక వర్గం
ఒక వర్గం వారి కోసం మాంసాహారం విక్రయాలు నిషేదించడం సరికాదు,
గడ్డి తినండి
అందరు అన్ని వదలిపెట్టి గడ్డి తినండి
లిమిట్ ఉంటుంది
నాన్ వెజిటేరియన్లకు ఒక లిమిట్ ఉంటుంది
మిగతా రోజులు
జైన్ వర్గీయులు మిగతా రోజులలో ఏం చేస్తారు ?