మోడీ ప్రభుత్వం, మునిగిపోయో నావ.. బీఎస్సీ చీఫ్ మాయవతి
ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ,బీఎస్పీ చీఫ్ మాయావతి మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనేలా తయారైంది..దళితులపై మాయవతి ముసలి కన్నీరు కారుస్తుందని ,ప్రధాని నరంద్రే మోడీ విమర్శలు చేశారు. దీంతో ఇద్దరి మధ్య రాజకీయ వైరం మరింత పెరిగింది. ఈనేపథ్యంలోనే మోడీపై మాయవతి వరుస ట్వీట్లతో విరుచుకుపడుతున్నారు.
ఈనేపథ్యంలోనే ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం ఒక మునిగిపోయో నావ అంటూ పేర్కోన్నారు. ఇందుకు నిదర్శం బీజేపీ సిద్దాంత సంఘం అయిన ఆర్ఎస్ఎస్ కూడ మోడీతో ఆ ప్రభుత్వ విధానాలనను వ్యతిరేకిస్తున్నారని తెలిపారు..ఈనేఫథ్యంలో బీజేపీ వచ్చే ఎన్నికల్లో ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని అన్నారు..దీంతో పాటు ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే నాయకుడు దేశ ప్రధానిగా రావాల్సిన అవసరం ఉందని ఆమే ట్వీట్ చేశారు.
ఇక సోమవారం ఎన్నికల ర్యాలీలో భాగంగా మాయవతి దళితుల కోసం పోరాడుతున్నట్టు ఆమే నటిస్తున్నారు తప్ప వారి కోసం చేసింది ఏమి లేదని మోడీ దుయ్యబట్టారు. ముఖ్యంగా రాజస్థాన్ లోని జరిగిన దళిత మహిళి ఆత్యచారం పై మాయావతిని కార్నర్ చేస్తూ.. ఆమే దళితులను కాపాడడంలో ముసలీ కన్నీరు కారుస్తుందని వ్యాఖ్యలు చేశారు. దీంతో అటు మాయవతి ఇటు నరేంద్రమోడీ వద్ద మాటల యుద్దం మొదలైంది.