గోవాలో ఆ ఎమ్మెల్యేలు పరుగో పరుగు: సర్ మీ కాళ్లుపట్టుకుంటాం!
మాకే మద్దతు ఇవ్వాలంటే మాకే ఇవ్వాలని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఒత్తిడి చెయ్యడంతో ఎవరికి మద్దతు ఇవ్వాలో అర్థం కాక గోవాలో స్వతంత్ర, ఇతర పార్టీల శాసన సభ్యులు బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు చిక్కకుండా తప్పించు
పనాజి: గోవాలో ఎవరికి మద్దతు ఇవ్వాలో అర్థం కాక అక్కడి స్వతంత్ర, ఇతర పార్టీల ఎమ్మేల్యేలుబీజేపీ, కాంగ్రెసనాయకులను తప్పించుకుని పరుగు తీస్తున్నారు. మాకే మద్దతు ఇవ్వాలంటే మాకే ఇవ్వాలని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఒత్తిడి చెయ్యడంతో ఆ ఎమ్మెల్చేలు తప్పించుకుని తిరుగుతున్నారు.
గోవాలో కాంగ్రెస్ 15 స్థానాలలో విజయం సాధించింది. ఇంతకాలం అధికారంలో ఉన్న బీజేపీ 13 స్థానాల్లో విజయం సాధించింది. ఇతరులు 10 స్థానాల్లో విజయం సాధించారు. వారిలో కాంగ్రెస్, బీజేపీ టిక్కెట్లు రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచిన వారు ఉన్నారు.
గోవా సురక్షా మంచ్, మహారాష్ట్ర గోమంతకర్ పార్టీ, శివసేన కలిసి పోటీ చెయ్యడంతో కొన్ని స్థానంలో ఆ కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి మహారాష్ట్ర గోమంతక్ పార్టీ మద్దతు ఇస్తోంది.
అయితే గత బీజేపీ ప్రభుత్వంలో సీఎం లక్ష్మీకాంత్ పర్సేకర్ మహారాష్ట్ర గోమంతక్ పార్టీకి చెందిన ఇద్దరు మంత్రలు పదవులకు ఎసరు పెట్టడంతో వారు బీజేపీకి మద్దతు ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు గోవా సురక్షా మంచ్ నాయకుడు సుభాష్ వెలింగ్ కర్ సైతం బీజేపీని వ్యతిరేకిస్తున్నారు.
గోవాలో ఇప్పుడు బీజేపీకి చావుబతుకుల సమస్య ఎదురైయ్యింది. గోవాలోనే మకాం వేసిన కేంద్ర మంత్రి మనోహర్ పారీకర్ గోవా సురక్షా మంచ్ నాయకుడు సుభాష్ వెలింగ్ కర్, శివసేన, మహారాష్ట్ర గోమంతక్ పార్టీ నాయకులను ఒప్పించి బీజేపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.