వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరాగ్‌పై చిందులు: సంప్రదింపులు జరపలే, ప్రకాశ్ జవదేకర్ స్పష్టీకరణ

|
Google Oneindia TeluguNews

బీహర్ ఎన్నికల్లో మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రచార పర్వంలో నేతలు హాట్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ రంగంలోకి దిగారు. నేరుగా ఎల్జేపీ నేత చిరాగ్ పాశ్వాన్ లక్ష్యంగా విరుచుకుపడ్డారు. బీజేపీ నేతలతో సంప్రదింపులు జరిపానని.. సమీకరణాలు మార్చే యత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కానీ చిరాగ్‌తో తమ పార్టీ నేతలెవరూ సంప్రదింపులు జరపలేదని జవదేకర్ స్పష్టంచేశారు.

ఈ-కామర్స్ సైట్ల పేరుతో దోపిడీ, వెలుగులోకి బీహర్ ముఠా నయా ఛీటింగ్ఈ-కామర్స్ సైట్ల పేరుతో దోపిడీ, వెలుగులోకి బీహర్ ముఠా నయా ఛీటింగ్

ప్రధాని మోడీ, అమిత్ షాను పొగిడి రాజకీయాలు చేద్దామని చిరాగ్ అనుకొంటున్నారని తెలిపారు. జేడీయూ అధినేత నితీశ్ కుమార్ లక్ష్యంగా ఆరోపణలు చేస్తున్నారని గుర్తుచేశారు. దీంతో బీజేపీతో తమకు లోపాయికారి ఒప్పందం ఉంది అనే కలరింగ్ చేస్తున్నారని జవదేకర్ విరుచుకుపడ్డారు. అయితే ఎల్జేపీతో తమకు ఎలాంటి పొత్తు లేదని.. తాము జేడీయూతో కలిసి పోటీచేస్తున్నానని జవదేకర్ క్లారిటీ ఇచ్చారు. జరుగుతోన్న ప్రచారంతో కన్‌ఫ్యూజ్ కావొద్దని చెప్పారు.

BJP slams Chirag Paswan, accuses LJP of spreading confusion..

బీహర్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ, హెచ్ఏఎంఎస్, వికాస్ షీల్ ఇన్సాన్ పార్టీలు కలిపి పోటీ చేస్తున్నాయని జవదేకర్ తెలిపారు. కానీ ఎల్జేపీ మాత్రం ఓట్ల పేరుతో రాజకీయాలు చేస్తుందన్నారు. జవదేకర్ కాదు బీజేపీ నేత భూపేందర్ యాదవ్ కూడా చిరాగ్ పాశ్వాన్‌‌పై విరుచుకుపడ్డారు. చిరాగ్‌కు అప్పుడే అబద్దాలు చెప్పడం అలవాటైపోయిందని చెప్పారు. లేని పొత్తును ఉన్నట్టు చూడటం సరికాదని.. తీరు మార్చుకోవాలని సూచించారు.

English summary
ljp chief chirag paswan trying to create a confusion by harping on his quations with senior leaders of our party central minister prakash javadekar said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X