మరో వివాదం: చికెన్ తిని ఆలయాన్ని దర్శించుకున్న రాహుల్
బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎన్నికల ప్రచారాల సందర్భంగా భారతీయ జనతా పార్టీని ధీటుగా ఎదుర్కొనేందుకు ఇటీవల ఆయన తరచుగా ఆలయాలను సందర్శిస్తున్న విషయం తెలిసిందే.
ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడే ఆలయాలను సందర్శిస్తుండటంతో.. రాహుల్ గాంధీని 'ఎన్నికల హిందువు'గా ఎద్దేవా చేస్తోంది బీజేపీ. రాహుల్ గాంధీ ఆలయాలను దర్శించుకోవడం ఎన్నికల స్టంట్ అని ఆరోపిస్తుంది.
Dear #ElectionHindu @OfficeOfRG, your #10PercentCM @siddaramaiah has failed the farmers. He failed to disburse the input subsidy released by the Centre. Of the ₹1,685.2 cr released by @narendramodi govt, state govt is yet to disburse over ₹800 cr. #Care2Ask? #RahulMustAnswer
— B.S. Yeddyurappa (@BSYBJP) February 11, 2018
తాజాగా, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాహుల్ గాంధీ రాష్ట్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా కూడా పలు ఆలయాలను దర్శించుకుంటున్నారు. అయితే, చికెన్ తినిమరీ ఆలయాలను దర్శించుకుంటున్నారని బీజేపీ.. రాహుల్పై మండిపడుతోంది.
'ఓ వైపు 10శాతం సీఎం సిద్ధరామయ్య చేపల కూర తిని.. ధర్మస్థలం మంజునాథుడిని దర్శించుకుంటే.. మరో వైపు ఎన్నికల హిందువు అయిన రాహుల్ గాంధీ జవారీ చికెన్ తిని నరసింహస్వామిని దర్శించుకున్నారు' అని బీజేపీ నేత, మాజీ సీఎం యడ్యూరప్ప ట్విట్టర్ వేదిక విమర్శించారు.
ಸಂಕಟ ಬಂದಾಗ ವೆಂಕಟರಮಣ ಎಂಬ ಮಾತು #ElectionHindu @OfficeOfRGಗೋಸ್ಕರವೇ ಹೇಳಿದಂತಿದೆ.ಹಿಂದೆಂದೂ ರಾಜ್ಯದ ದೇವಸ್ಥಾನಗಳಿಗೆ ಭೇಟಿ ನೀಡದೆ,ಈಗ ದೇವಸ್ಥಾನಗಳಿಗೆ ಹೋಗುವುದು ನಕಲಿ ಭಕ್ತಿಯೆಂದು ರಾಜ್ಯದ ಜನತೆಗೆ ತಿಳಿದಿದೆ.ಇವರು ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಹೋಗುವುದು,ಸರ್ಕಾರ ದೇವಸ್ಥಾನ ಮತ್ತು ಮಠಗಳ ಸ್ವಾಧೀನಕ್ಕೆ ಯತ್ನಿಸುವುದು ಗೋಮುಖವ್ಯಾಘ್ರ ವರ್ತನೆ. pic.twitter.com/3fvgbZw6OL
— B.S. Yeddyurappa (@BSYBJP) February 10, 2018
Recommended Video
'హిందువుల మనోభావాలను కాంగ్రెస్ పార్టీ ఎందుకు గాయపరుస్తోంది? ఆ పార్టీది సమాజవాదం కన్నా మజావాదం(ఎంజాయ్ చేయడం) ఎక్కువ కనిపిస్తోంది' అని ఆయన దుయ్యబట్టారు. రాహుల్ నరసింహస్వామిని దర్శించుకున్న పొటోలను ఆయన ట్వీట్ చేశారు. కాగా, గతంలో చేపల కూరతో మధ్యాహ్న భోజనం చేసిన అనంతరం సీఎం సిద్ధరామయ్య మంజునాథ ఆలయాన్ని దర్శించుకోవడం వివాదాస్పదమైంది.