బీజేపీ భాగస్వామిగా జమ్ము కాశ్మీర్లో ప్రభుత్వం: రామ్ మాధవ్
న్యూఢిల్లీ: జమ్ము కాశ్మీర్లో తదుపరి ఏర్పడే ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ రామ్ మాధవ్ వెల్లడించారు. ఆయన జమ్ము కాశ్మీర్లో పర్యటిస్తున్నారు. దీంతో మళ్లీ ప్రభుత్వ ఏర్పాటుపై ఊహాగానాలు వచ్చాయి. దీంతో ఆయన స్పందించారు.
ఇక్కడ తదుపరి ప్రభుత్వం ఏర్పాటయితే ఆ ప్రభుత్వంలో కచ్చితంగా బీజేపీ ఉంటుందని గట్టిగా విశ్వసిస్తున్నానని రామ్ మాధవ్ తెలిపారు. పీడీపీతో పొత్తు తెగిపోవడంపై స్పందిస్తూ.. ఈ పొత్తులో ఇబ్బందులు వచ్చాయని, కానీ కొన్నింటిని సాధించామన్నారు.
జమ్ము కాశ్మీర్కు తాము ఎంతో చేయాలని భావించామని చెప్పారు. కానీ అందుకు తగినట్లుగా ముఫ్తీ ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లుకా కనిపించలేదన్నారు. దీంతో ఆ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చామని చెప్పారు. కాశ్మీర్లో తాము అధికారంలోకి లేకపోయినప్పటికీ రాష్ట్రంలో భద్రతా పరిస్థితిని అధిగమించామన్నారు.