మాకు పూర్తి మెజారిటీ ఉంది, బలాన్ని నిరూపించుకొంటాం: బిజెపి ఎమ్మెల్యే ప్రభు చవాన్
బెంగుళూరు: తమకు పూర్తి మెజారిటీ ఉందని బిజెపికి చెందిన ఎమ్మెల్యే ప్రభు చవాన్ అభిప్రాయపడ్డారు. అయితే సాయంత్రం వరకు వేచి చూద్దాం ఏం జరుగుతోందోనన్నారు. అంతేకాదు సాయంత్రం తాము మెజారిటీని నిరూపించుకొంటామని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.
మే 19వ తేదిన యడ్యూరప్ప అసెంబ్లీలో విశ్వాసాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీలో 222 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. బిజెపికి 104 సీట్లు దక్కాయి. కాంగ్రెస్ పార్టీకి 38 సీట్లు, జెడి(ఎస్)కు 38 సీట్లు, ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు విజయం సాధించారు.
అయితే ఈ తరుణంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మే 19వ తేది సాయంత్రం యడ్యూరప్ప విశ్వాస పరీక్షలో తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. ఈ తరుణంలో కాంగ్రెస్, జెడి(ఎస్) పార్టీలు వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నాయి.
బిజెపి నేతలు కూడ విశ్వాస పరీక్షలో విజయం సాధిస్తామని ధీమాతో ఉన్నారు. ఈ తరుణంలో కర్ణాటకలో యడ్యూరప్ప విశ్వాస పరీక్షపై అందరి కళ్ళు ఉన్నాయి. ఈ తరుణంలో బిజెపి ఎమ్మెల్యే తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి.
ఇప్పటికే తమకు పూర్తిస్థాయి మెజారిటీ ఉందని బీదర్ జిల్లాలోని ఆరద్ నియోజకవర్గానికి చెందిన బిజెపి ఎమ్మెల్యే ప్రభు చవాన్ చెప్పారు. అంతేకాదు సాయంత్రం వరకు ఎదురు చూద్దామని ఆయన మీడియాకు సూచించారు. సాయంత్రం పూట విశ్వాసపరీక్షలో తాము విజయం సాధిస్తామని ప్రభు ధీమాను వ్యక్తం చేశారు.