గుజరాత్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం-News Reel
గుజరాత్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార బీజేపీ 476 స్థానాల్లో విజయం సాధించిందని ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది.
ఈ గెలుపుతో ఆరు నగర పాలక సంస్థల్లో బీజపీ అధికారాన్ని కైవసం చేసుకుందని ఏఎన్ఐ తెలిపింది.
ఈ విజయం ప్రజలు తమపై ఉంచిన నమ్మకానికి, విశ్వాసానికి నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.
https://twitter.com/ANI/status/1364206869502259208
ఇటు హోంమంత్రి అమిత్ షా కూడా బీజేపీ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు పట్టం కట్టారని ట్విటర్లో పేర్కొన్నారు. మరోవైపు సూరత్లో తాము గణనీయమైన విజయాలు సాధించామని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది.
గుజరాత్లో కొత్త రాజకీయానికి తెరలేపిన ప్రజలకు తాను శుభాకాంక్షలు తెలుపుతున్నానని దిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ .
సూరత్లో 120 స్థానాలకు 93, వదోదరలో 76 స్థానాలకు 69, రాజ్కోట్లో 72లో 68, భావ్నగర్ 52 సీట్లలో 44, జామ్నగర్లో 64లో 50, అహ్మదాబాద్లో 159కి 152 సీట్లను బీజేపీ కైవసం చేసుకుంది.
కాంగ్రెస్ పార్టీ చాలా చోట్ల డిపాజిట్లు కోల్పోయిందని, కేవలం 44 సీట్లలోనే ఆ పార్టీని గెలిపించడం ద్వారా ప్రజలు ఆ పార్టీకి స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారని అమిత్ షా తన ట్వీట్లో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
- విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమానికి 'గంటా’ పిలుపు.. ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది
- కాకినాడ సెజ్: విజయసాయిరెడ్డి బంధువుల చేతుల్లోకి భూములు వెళ్తున్నాయా?
- '18 మందిని చంపిన సీరియల్ కిల్లర్’: ఒంటరి మహిళలతో మాట కలుపుతాడు... కోరిక తీర్చుకుని కడతేరుస్తాడు...
- నియాండర్తాల్ మానవులు, తొలి తరం ఆధునిక మానవుల మధ్య సెక్స్ గురించి శాస్త్రవేత్తలు ఏం తెలుసుకున్నారు?
- నేపాల్ వెళ్తే జేబు ఖాళీయే
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)