ప్రగ్యా సింగ్ ర్యాలీలో నల్లజెండాల రచ్చ..! ఎన్సీపీ కార్యకర్తపై బీజేపీ శ్రేణుల దాడి (వీడియో)
భోపాల్ : సమ్మర్ వేడి సంగతేమో గానీ.. ఎన్నికల వేళ నేతలు హీట్ పెంచేస్తున్నారు. ప్రత్యర్థులపై ఆరోపణలు గుప్పిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అయితే నేతల మధ్య మాటల యుద్ధం వేడి పుట్టిస్తుంటే.. కార్యకర్తలు ఓ అడుగు ముందుకేసి కొట్టుకుంటున్నారు. కొన్నిచోట్ల నేతలు తిట్లకు, ఆరోపణలకు తావిస్తూ ప్రచారంలో దూసుకెళుతుంటే.. కార్యకర్తలు మాత్రం రోడ్డెక్కి తన్నుకుంటున్నారు.
50 లక్షలు, ప్రభుత్వోద్యోగం..! గుజరాత్ అల్లర్ల కేసులో సుప్రీంకోర్టు తీర్పు
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో బీజేపీ, ఎన్సీపీ కార్యకర్తల మధ్య చిచ్చు రేగింది. రెచ్చిపోయిన బీజేపీ శ్రేణులు.. ఎన్సీపీ కార్యకర్తపై దాడి చేశారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి ప్రగ్యా సింగ్ ఠాకూర్ రోడ్డు షో సందర్భంగా జరిగిన ఘటన బీజేపీ శ్రేణులకు ఆగ్రహం తెప్పించింది. ఎన్సీపీ కార్యకర్తలు కొందరు నల్ల జెండాలు ప్రదర్శించారనే ఆరోపణలతో వారి చేతికి చిక్కిన ఓ యువకుడిని చితకబాదారు. అక్కడే ఉన్న పోలీసులు అడ్డువచ్చినా వెనక్కి తగ్గలేదు. చివరకు ఆ ఎన్సీపీ కార్యకర్తను అక్కడినుంచి తరలించడంతో పరిస్థితి సద్దుమణిగింది.
Madhya Pradesh: BJP workers thrashed an NCP worker at SDM office in Bhopal after he allegedly showed black flags to Pragya Singh Thakur, BJP LS candidate from Bhopal, during her roadshow. pic.twitter.com/WsbgIiThWD
— ANI (@ANI) April 23, 2019