వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నోకియా ప్లాంట్ మూసివేత, వీధుల్లో పడిన ఉద్యోగులు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తమిళనాడులోని శ్రీ పెరంబుదూరులో ఏర్పాటు చేసిన నోకియా కంపెనీని శాశ్వతంగా మూసివేశారు. ఈ యూనిట్ కార్యకలాపాలను శనివారం నుంచి నిలిపివేస్తున్నట్లు గతంలోనే ఈ సంస్ధ ప్రకటించిన విషయం తెలిసిందే.

చెన్నై - కాంచీపురం మధ్య ఉన్న శ్రీ పెరంబుదూరు వద్ద 220 ఎకరాల స్ధలంలో 'నోకియా' సంస్ధ మొబైల్ ఫోన్ల తయారీ యూనిట్‌ను నెలకొల్పింది. జనవరి 2006 నుంచి ఈ యూనిట్‌లో మొబైల్ ఫోన్ల్ ఉత్పత్తి ఆరంభమైంది.

Black Friday for workers as Nokia shuts Chennai factory

ఇక్కడి నుంచి నోకియా ఇప్పటి వరకూ 96 కోట్ల మొబైల్ ఫోన్లను ఉత్పత్తి చేసింది. ఈ సంస్ధలో మూడు షిప్టుల్లో ఎనిమిది వేల మంది పనిచేసేవారు. ఇప్పడు వారంతా పనులు లేక వీధుల్లో పడాల్సిన పరిస్దితి వచ్చింది.

పరోక్షంగా పాతికవేల మంది ఉపాధి పొందేవారు. చివరి రోజు ఉద్యోగులు ఆ యూనిట్ నుంచి భారమైన హృదయాలతో బయటకు కదిలారు. పన్ను వివాదాలన్నీ ఆ సంస్ధ పరిష్కరించుకునే వరకూ నోకియా ప్లాంట్ సెంట్రలో బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్ ఆధీనంలోకి వెళుతుంది. ఆ విభాగం తరుపున శ్రీ పెరంబుదూరు తహసీల్దార్ ఈ ప్లాంట్‌ను పరిరక్షిస్తారు.

English summary
Once a showpiece of foreign investment, the factory at Sriperumbudur, about 45 km from Chennai, now looks like a ghost entity. For the around 30,000 workers, 31 October will forever be Black Friday as Nokia officially shutdowns its plant in the state, nine years after it entered India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X