35 ఏళ్ళ మహిళను 45 రోజుల పాటు గదిలో ఏం చేశారంటే?
జైపూర్:టెక్నాలజీ పెరిగినా ఇంకా మూఢనమ్మకాలను ప్రజలు వీడడం లేదు. అనారోగ్యం పాలైన 35 ఏళ్ళ మహిళ ఆరోగ్యాన్ని నయం చేస్తామని నమ్మించారు. కానీ, ఆమె చివరకు చనిపోయింది.చనిపోయిన తర్వాత కూడ ఆమెను తిరిగి బతికిస్తామని కుటుంబసభ్యులను నమ్మించి మృతదేహన్ని 45 రోజుల పాటు గదిలోనే ఉంచారు. బాధితుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు నలుగురు మంత్రగాళ్ళను అరెస్ట్ చేశారు.
టెక్నాలజీ సహయంతో మానవుడు చంద్రమండలంపైకి వెళ్తున్నాడు. కానీ, ఇంకా కూడ మూఢనమ్మకాలను వీడడం లేదు. మూఢ నమ్మకాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
అయితే టెక్నాలజీ ప్రజలకు అందుబాటులోకి వచ్చినా కానీ, ప్రజలు మాత్రం ఇంకా మూఢనమ్మకాలను నమ్ముతున్నారు. రాజస్థాన్ రాష్ట్రంలో ఇదే తరహ ఘటన చోటు చేసుకొంది.
రోగాన్ని నయమ చేస్తామని మహిళను చంపేశారు
రోగాన్ని నయం చేస్తామని చెప్పిన మంత్రగాళ్ళు 35 ఏళ్ళ మహిళను చంపేశారు. రాజస్థాన్లో దారుణం చోటుచేసుకుంది. అనారోగ్యం పాలైన ఓ 35 ఏళ్ల మహిళను మంత్రాలతో, శాంతి పూజలతో బాగుచేస్తామని నమ్మబలికి చివరకి ఆమె ప్రాణాలు తీశారు ఐదుగురు మంత్రగాళ్లు. రాజస్థాన్లోని సవాయి మాధోపూర్ జిల్లాలో ఉన్న గంగాపూర్ పట్టణంలో వెలుగుచూసింది.
బతికిస్తామని 45 రోజులు ఇలా చేశారు
చనిపోయిన మహిళను బతికిస్తామంటూ ఆమెను తిరిగి బతికిస్తామంటూ 45 రోజుల పాటు ఆమెను గదిలోనే ఉంచి తాళం వేశారు.45 రోజుల పాటు గదిలోనే ఉంచి పూజలు నిర్వహించారు. కానీ, ఆమె బతికి రాలేదు. కానీ, ఆమె బతికలేదు. దీంతో బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
డాక్టర్ వద్దకు తీసుకెళ్ళలేదు
రాజస్థాన్ రాష్ట్రంలోని సవాయి మాధోపూర్ జిల్లాలో ఉన్న గంగాపూర్ పట్టణంలో అనారోగ్యానికి గురైన మహిళను ఆసుపత్రికి తీసుకెళ్ళకుండా నయం చే్స్తామని మంత్రగాళ్ళు నమ్మించారు. దుష్ట శక్తుల కారణంగానే మహిళకు అనారోగ్యానికి గురైనట్టు నమ్మించారు. మంత్రాల సహయంతో నయం చేస్తామని నమ్మించారు. వారి మాటలను నమ్మిన కుటుంబసభ్యులు మహిళను ఆసుపత్రికి తీసుకెళ్ళలేదు. దీంతో మంత్రగా ళ్ళు మంత్రించి వదిలేశారు. కానీ, అప్పటికే ఆమె ఆరోగ్యం క్షీణించిపోయింది.
స్పృహ కోల్పోయేలా చేశారు.
ఫిబ్రవరి 14 వ తేదిన బాధిత మహిళ స్పృహ కోల్పోయింది. అయినా మంత్రగాళ్ళు మాత్రం ఇంకా కుటుంబసభ్యులను నమ్మించారు. బాధిత మహిళకు నయం చేస్తామని చెప్పారు. చనిపోయిన విషయాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. చనిపోయినా బాధితురాలిని బతికిస్తామని నమ్మించారు. గదిలోనే బాధితురాలిని వేసి తాళం వేశారు. సుమారు 45 రోజుల పాటు గదిలోనే వేసి ఉంచారు. బాధితురాలి శరీరం నుండి సుగంధ పరిమళాలు వస్తున్నాయని చెప్పారు. అందుకే సుగంధ పరిమళాలను ఇంట్లోనే ఉంచి కుటుంబసభ్యులను భ్రమింపజేశారు.