భిలాయ్ స్టీల్ ప్లాంట్లో భారీ పేలుడు...ఆరుగురు మృతి
ఛత్తీస్గఢ్లోని భిలాయ్లో ఉన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 6 మంది మృతి చెందగా 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరందరినీ చికిత్స కోసం హాస్పిటల్కు తరలించారు. వీరందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
Chhattisgarh: Visuals from outside a hospital in Bhilai; 6 people have died and 14 injured in a gas pipeline blast in Bhilai Steel Plant. pic.twitter.com/aQGFNr3LIg
— ANI (@ANI) October 9, 2018
అగ్ని ప్రమాదానికి కారణం ప్లాంట్లో పేలుడు చోటుచేసుకోవడమేనని అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం 10:50 గంటలకు ప్లాంట్లో పేలుడు చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. ఈ పేలుడు గ్యాస్ పైప్లైన్లో సంభవించినట్లు వారు వివరించారు. ఘటన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించారు. ఉన్నతాధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
గతేడాది నవంబర్లో ఉత్తర్ ప్రదేశ్లోని ఉన్చహార్లోని నేషనల్ థర్మల్ పవర్ కార్పోరేషన్ లిమిటెడ్ పేలుడు సంభవించడంతో 43 మంది మృతి చెందారు. ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక అందించాల్సిందిగా ప్రభుత్వం నలుగురు సభ్యులతో కూడిన కమిటీ వేసింది. అయితే ఈ ప్రమాదానికి కారణం ఆపరేషన్స్ సిబ్బందే అని కమిటీ నివేదికలో పేర్కొంది. యూనిట్ను మూసివేసి ఉంటే ప్రమాదం జరిగేది కాదని దీన్ని కూడా సిబ్బంది విస్మరించిందని అందుకే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని కమిటీ రిపోర్ట్ పేర్కొంది.