జమ్ము కశ్మీర్లో పంచాయితీ ఎన్నికలు...రెండు రోజుల్లో నోటిఫికేషన్
జమ్ము కశ్మీర్లో ప్రజాస్వామ్య పునరుద్దణకు ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఆక్టోబర్ 31న కేంద్రపాలిత ప్రాంతంగా మారనున్న నేపథ్యంలోనే అక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని భావిస్తుంది. ఇందుకోసం మరో రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేయనుంది.
జమ్ము కశ్మీర్ విభజన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావించిన విషయం తెలిసిందే. అయితే ఆక్టోబర్ 31న పూర్తి స్థాయి కేంద్రపాలిత ప్రాంతంగా మారనుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం బావించింది. అయితే కశ్మీర్ పునర్విభజన తర్వాత అసెంబ్లీ స్థానాలను పునర్విభజన జరపాల్సి రావడంతో అసెంబ్లీ ఎన్నికలు ఆలస్యం అయ్యో అవకాశాలు కనిపిస్తున్నాయి.
దీంతో ముందుగా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. అదికూడ అక్టోబర్ 31లోగా మొత్తం 316 డెవలప్మెంట్ కౌన్సిళ్లలో పాటు జిల్లాపరిషత్లకు కూడ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకోసం రెండు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ముఖ్యంగా గ్రామస్థాయిలో ప్రజాస్వామ్యాన్ని పునరిద్దేంచేందుకు ఇది దోహదపడుతుందని భావించిన కేంద్రం ఎన్నికల నిర్వహాణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు కశ్మీర్ అభివృద్ది కోసం ప్రధాని మోడీ హామి ఇచ్చారు. అయితే గ్రామపంచాయితీలు రద్దు కావడంతో గ్రామాల అభివృద్దికి రావాల్సిన 14 వ ఆర్ధిక సంఘం కేటాయించిన సుమారు 2700 కోట్ల రుపాయల నిధులు కూడ ఆగిపోయాయి. ఈ నిధులు విడుదల కావాలంటే స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉందని కశ్మీర్ ఉన్నతాధికారులు వివరించారు.
జమ్ము కశ్మీర్లో ప్రజాస్వామ్య పునరుద్దణకు ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఆక్టోబర్ 31న కేంద్రపాలిత ప్రాంతంగా మారనున్న నేపథ్యంలోనే అక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని భావిస్తుంది. ఇందుకోసం మరో రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేయనుంది.
జమ్ము కశ్మీర్ విభజన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావించిన విషయం తెలిసిందే. అయితే ఆక్టోబర్ 31న పూర్తి స్థాయి కేంద్రపాలిత ప్రాంతంగా మారనుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం బావించింది. అయితే కశ్మీర్ పునర్విభజన తర్వాత అసెంబ్లీ స్థానాలను పునర్విభజన జరపాల్సి రావడంతో అసెంబ్లీ ఎన్నికలు ఆలస్యం అయ్యో అవకాశాలు కనిపిస్తున్నాయి.
దీంతో ముందుగా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. అదికూడ అక్టోబర్ 31లోగా మొత్తం 316 డెవలప్మెంట్ కౌన్సిళ్లలో పాటు జిల్లాపరిషత్లకు కూడ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకోసం రెండు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ముఖ్యంగా గ్రామస్థాయిలో ప్రజాస్వామ్యాన్ని పునరిద్దేంచేందుకు ఇది దోహదపడుతుందని భావించిన కేంద్రం ఎన్నికల నిర్వహాణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు కశ్మీర్ అభివృద్ది కోసం ప్రధాని మోడీ హామి ఇచ్చారు. అయితే గ్రామపంచాయితీలు రద్దు కావడంతో గ్రామాల అభివృద్దికి రావాల్సిన 14 వ ఆర్ధిక సంఘం కేటాయించిన సుమారు 2700 కోట్ల రుపాయల నిధులు కూడ ఆగిపోయాయి. ఈ నిధులు విడుదల కావాలంటే స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉందని కశ్మీర్ ఉన్నతాధికారులు వివరించారు.