చెన్నై బీచ్ లో వింత వెలుగు: రాత్రి వేళ నీలం రంగును సంతరించుకున్న సంద్రం!
Recommended Video
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నై తీర ప్రాంతంలో ఆదివారం రాత్రి వింత వెలుగులు కనిపించాయి. తీర ప్రాంతం పొడవునా ఈ వెలుగులు సందర్శకులకు కనువిందు చేశాయి. హోరుమని శబ్దం చేస్తూ తీరానికి చేరుకునే అలలు నీలం రంగులో మెరిసిపోయాయి. కన్ను పొడుచుకున్నా కానరాని చీకట్లో నీటి అలలు నీలంరంగులో మెరిసిపోవడాన్ని వింతగా తిలకించారు చెన్నై వాసులు. తమ సెల్ ఫోన్లకు పని చెప్పారు. నీలం రంగును సంతరించుకున్న అలలను తమ సెల్ కెమెరాల్లో బంధించారు. అలలు తాకిన ప్రదేశం కూడా నీలంగా మారిపోవడం సందర్శకులను ఆశ్యర్యానికి గురి చేసింది.
డేంజర్ మార్క్: దేశ రాజధానిని భయపెడుతున్న యమున: కేజ్రీవాల్ అత్యవసర భేటీ!
ఆదివారం రాత్రి సుమారు 8 గంటల తరువాత క్రమంగా చెన్నైలోని తిరువాన్మియూర్ బీచ్ లో చెన్నైలోని తిరువాన్మియూర్ బీచ్ లో మొదటగా ఈ వింత వెలుగు కనిపించింది. తీర ప్రాంతం పొడవునా అదే తరహా వింత వెలుగులు అలముకున్నాయి. సముద్రం మీదుగా వీచే గాలుల్లో కూడా అసాధారణ తేడా కనిపించిందని సందర్శకులు చెబుతున్నారు. కొద్దిసేపు చల్లగా, క్షణాల్లోనే వేడి గాలులు వీచాయని, ఇలా ఎప్పుడూ చోటు చేసుకోలేదని సందర్శకులు వెల్లడించారు.
బయోలూమినెస్సీన్స్ వల్లే సముద్రం ఇలా నీలం రంగును సంతరించుకుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. సముద్ర జలాల్లో ఉండే ఓ రకమైన బ్యాక్టీరియాలతో పాటు, యాల్జీ, జెల్లిఫిష్, సముద్రపు పురుగులు, సముద్రాల్లో జీవించే నక్షత్రపు పురుగుల వల్ల ఈ నీలంరంగు అలముకుని ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు.
వాతావరణంలో చోటు చేసుకునే పెను మార్పుల (క్లైమెట్ ఛేంజ్) వల్ల కూడా ఇలాంటి పరిస్థితులు తలెత్తడానికి ఓ కారణమౌతాయని అంచనా వేశారు. సాధారణంగా ఇలాంటి దృశ్యాలు ప్యూర్టోరికో, శాన్ డియాగో, ఫ్లోరిడా, జపాన్ తీర ప్రాంతాల్లో తరచూ కనిపిస్తుంటాయని, చెన్నై తీరంలో ఏర్పడటం అరుదు అని అంటున్నారు.