బీఎంసీ రిజల్ట్స్: రికార్డు సృష్టించిన శివసేన మాజీ మేయర్ శ్రద్ధా జాదవ్
బీఎంసీ మాజీ మేయర్, శివసేన నాయకురాలు శ్రద్ధా జాదవ్ ఈ ఎన్నికల్లో రికార్డ్ స్థాయిలో వరుసగా ఆరోసారి విజయం సాధించారు. వార్డ్ నెం. 202 నుంచి విజయం సాధించారు.
ముంబై: బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో శివసేన దూకుడు చూపిస్తోంది. కాగా, బీఎంసీ మాజీ మేయర్, శివసేన నాయకురాలు శ్రద్ధా జాదవ్ ఈ ఎన్నికల్లో రికార్డ్ స్థాయిలో వరుసగా ఆరోసారి విజయం సాధించారు. వార్డ్ నెం. 202 నుంచి విజయం సాధించారు.
లైవ్: బీఎంసీ ఎన్నికల ఫలితాలు: ముంబైలో శివసేన హవా, పుణెలో బీజేపీ దూకుడు
కాగా, బీజేపీ ఎంపీ కిరీట్ సోమాలియా కుమారుడు నెయిల్.. వార్డ్ నెం. 108 నుంచి గెలుపొందగా, ముంబై బీజేపీ విభాగం చీఫ్ ఆశీష్ షెలర్ సోదరుడు వినోద్ షెలార్ వార్డ్ నెం. 51లో ఓటమి పాలయ్యారు.
ఇది ఇలా ఉండగా, 227 వార్డులున్న బీఎంసీలో కౌంటింగ్ మొదలైనప్పటి నుంచీ శివసేన ఆధిక్యం కనబరుస్తూనే ఉంది. శివసేన 92 స్థానాల్లో ఆధిక్యం కొనసాగిస్తుండగా, బీజేపీ 56స్థానాల్లో ఆధిక్యత కనబర్చింది. కాంగ్రెస్, ఎన్సీపీలు మాత్రం వెనకంజలోనే ఉన్నాయి. శివసేనకు ఎక్కువ స్థానాల్లో ఆధిక్యం రావడంతో పార్టీ నేతలు, కార్యకర్తలు అప్పుడే సంబరాలు ప్రారంభించారు.