షాకింగ్: యువతిని బస్సులో వేసి తాళమేసిన కండక్టర్
బెంగళూరు: బెంగళూరులో దారుణం జరిగింది. బెంగళూరు మెట్రో సిటీ కండక్టర్ ఒకరు ఓ అమ్మాయిని 45 నిమిషాల పాటు బస్సులో వేసి తాళం వేశారు. ఇందుకు సంబంధించి పోలీసులు అతనిని అరెస్టు చేశారు. ఈ సంఘటన ఎలహంక ప్రాంతంలో గురువారం నాడు జరిగింది.
డిజైనింగ్ కళాశాలలో చదువుకుంటున్న యువతి సాయంత్రం ఇంటికి వెళ్లడానికి బిఎంటిసి పరిధిలో నడుస్తున్న ఓ బస్సును ఎక్కింది. మహిళల విభాగంలో ఆమె కూర్చోగా సమీపంలో ఆమె స్నేహితుడు నిలబడ్డాడు. అందుకు కండక్టర్ అభ్యంతరం తెలిపాడు. దీనిపై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
వివాదం నేపథ్యంలో బస్సు ముందుకు కదలలేదు. అపేశారు. గొడవ నేపథ్యంలో బస్సు ఆగగానే ఆమె స్నేహితుడు పారిపోయాడు. జనం అందరూ గుమిగూడి కండక్టర్కు మద్దతు తెలిపారు. వారందరూ కండక్టర్ని ఆమెను బంధించాల్సిందిగా ప్రోత్సహించారు.
దీంతో ఆమెను అక్కదానినే బస్సులో ఉంచి తాళం వేశాడు. ఆమె స్నేహితుడు తిరిగి వస్తే కానీ విడిచి పెట్టనని చెప్పారు. ముప్పావు గంట పాటు ఆమెను బస్సులో ఉంచారు. ఆమె స్నేహితుడు వచ్చి నచ్చజెప్పటంతో ఆమెను వదిలేశారు.
ఈ విషయమై యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరోవైపు, కండక్టరు కూడా యువతిపై కేసు పెట్టాడు. దాని పైనా విచారణ జరుగుతోంది. ఇదిలా ఉండగా కండక్టర్ను పోలీసులు శుక్రవారం నాడు అదుపులోకి తీసుకున్నారు.