వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అయ్యో పాపం: బావిలో బయటపడ్డ ఐదుగురు చిన్నారుల మృతదేహాలు

|
Google Oneindia TeluguNews

మధ్యప్రదేశ్: మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. బర్వానీ జిల్లా చికిలి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుమంది చిన్నారులు మృతి చెందారు. వారి మృతదేహాలు బావిలో తేలియాడుతూ కనిపించాయి.మృతి చెందిన చిన్నారులంతా మగపిల్లలే కావడం విశేషం. వీరి వయస్సు మూడు నుంచి ఏడేళ్ల మధ్య ఉంటుందని అడిషనల్ ఎస్పీ ఓంకార్ సింగ్ కాలేష్ చెప్పారు. ప్రస్తుతం పిల్లల తల్లిదండ్రులు పరారాలో ఉన్నారని కేసును విచారణ చేస్తున్నామని చెప్పారు.

ఇదిలా ఉంటే మృతి చెందిన పిల్లల తండ్రి భరత్ సింగ్ కుటుంబంలో కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. ఆయను ఇద్దరు భార్యలు అని చెప్పారు. బావిలో ఐదుగురు పిల్లల మృతదేహాలు తేలుతూ కనిపించడంతో చికిలి గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బావిలోకి దూకి మృతదేహాలను వెలికి తీశారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టంకు పంపారు.

Bodies of five minor brothers found in well in MP

మృతి చెందిన వారిలో నలుగురు పిల్లలు మొదటి భార్య సుందరీబాయ్‌కు పుట్టారని మరో అబ్బాయి అనితా బాయ్‌కు పుట్టారని గ్రామస్తులు తెలిపారు. ప్రస్తుతం భరత్ సింగ్ అతని ఇద్దరు భార్యలు పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

English summary
Bodies of five minor siblings were found floating in a well Wednesday in Chikhli village in Madhya Pradesh's Barwani district, the police said. Parents of the deceased, all boys aged between three to seven years, are absconding, an officer said. Additional Superintendent of Police (ASP) Omkar Singh Kalesh said the circumstances under which these children have died are being investigated.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X