వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దారుణం: స్కూల్ టాయ్‌లెట్‌లో రక్తపుమడుగులో విద్యార్థి మృతదేహం

|
Google Oneindia TeluguNews

గాంధీనగర్: గుజరాత్ రాష్ట్రంలోని వడోదరాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ పాఠశాలలోని టాయిలెట్‌లో ఓ విద్యార్థి మృతదేహం లభ్యమైంది. ఆ మృతదేహానికి కత్తిపోట్లు ఉండటం గమనార్హం.

వివరాల్లోకి వెళితే.. వడోదరలోని ఓ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న 14ఏళ్ల కుర్రాడి మృతదేహం టాయిలెట్‌లో రక్తపు మడుగులో పడివుంది. బాలుడి శరీరంపై కత్తిపోట్లు ఉన్నాయి.

Body of Class 9 student with stab wounds found in Vadodara school toilet

శుక్రవారం మధ్యాహ్నం రక్తపుమడుగులో ఉన్న బాలుడి మృతదేహాన్ని గుర్తించిన పాఠశాల సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహం వద్ద లభించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాలుడి హత్యకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం తెలిసే అవకాశం ఉంది. కాగా, ఈ ఘటన గత సంవత్సరం సంచలనం రేపిన గుర్గావ్‌లోని రేయాన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో జరిగిన ప్రద్యుమన్ ఠాకూర్ హత్యకు గుర్తు తెచ్చేలా ఉంది.

English summary
A 14-year-old tribal student was found with stab wounds in the washroom of a school in Gujarat’s Vadodara district on Friday, ANI reported. He succumbed to his injuries before the ambulance could arrive. Police suspect the Class 9 student was murdered with a sharp object.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X