మిగ్ -29 కె విమాన పైలట్ నిశాంత్ సింగ్ మృతదేహం ..11 రోజుల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత లభ్యం
మిగ్ -29 కె విమాన పైలట్ కమాండర్ నిశాంత్ సింగ్ మృతదేహాన్ని గోవా తీరంలో మిస్ అయిన 11 రోజుల తర్వాత నేవీ ఈ రోజు గుర్తించింది .ఆయన మృతదేహాన్ని స్వాధీనం చేసుకుంది. గత నెలలో మిగ్ -29 కె జెట్ నవంబర్ 26 న అరేబియా సముద్రం మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు కుప్పకూలింది. నవంబర్ 26వ తేదీన రష్యాకు చెందిన జెట్ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్య నుండి బయలుదేరి నింగికెగిసిన మిగ్ 29 కే కొద్దిసేపటికే గ్రౌండ్ కంట్రోల్ తో సంబంధాలు కోల్పోయి, తీరానికి కొద్ది దూరంలో సముద్రం లో కుప్పకూలిన పోయింది.
రైతుల ఆందోళన .. భారత్ అంతర్గత సమస్య ..లండన్ నిరసనల వెనుక అజెండా ఇదే .. ఇండియన్ ఎంబసీ
పైలట్ నిశాంత్ సింగ్ కోసం సెర్చ్ అండ్ రెస్క్యూ మిషన్
ఈ ఘటనలో ఒక పైలెట్ ను సహాయ బృందాలు కాపాడగా, నిశాంత్ సింగ్ అనే మరో పైలెట్ గల్లంతయ్యారు. అప్పటినుండి నిశాంత్ సింగ్ కోసం భారత నేవీ బృందాలు తీవ్రస్థాయిలో గాలింపు చేపట్టింది .తప్పిపోయిన పైలట్ నిశాంత్ సింగ్ ను గుర్తించడం కోసం సెర్చ్ అండ్ రెస్క్యూ మిషన్లో భాగంగా భారత నావికాదళం తొమ్మిది యుద్ధనౌకలు, 14 విమానాలు మరియు అనేక ఫాస్ట్ ఇంటర్సెప్టర్ క్రాఫ్ట్లను రంగంలోకి దింపింది.నవంబర్ 29 న, మిగ్ -29 కె విమానం యొక్క కొన్ని శిధిలాలను నావికాదళం స్వాధీనం చేసుకుంది, కాని అప్పుడు కమాండర్ నిశాంత్ సింగ్ యొక్క జాడ దొరకలేదు.
గోవా తీరానికి 30 కిలోమీటర్ల దూరంలో, నీటి ఉపరితలానికి 70 మీటర్ల లోతులో మృతదేహం
ల్యాండింగ్ గేర్, టర్బోచార్జర్, ఫ్యూయల్ ట్యాంక్ ఇంజిన్ మరియు వింగ్ ఇంజిన్ కౌలింగ్తో సహా విమానం యొక్క కొన్ని శిధిలాలు మాత్రమే లభించాయని నేవీ పేర్కొంది. మిగ్ -29 కె యొక్క ప్రాధమిక శిధిలాల సమీపంలో ప్రత్యేక పరికరాలను ఉపయోగించి డైవర్స్ మరియు సీ బెడ్ మ్యాపింగ్ ద్వారా నీటి అడుగున శోధన కూడా చేపట్టబడింది. ఈ రోజు నిశాంత్ సింగ్ మృతదేహాన్ని గోవా తీరానికి 30 కిలోమీటర్ల దూరంలో గుర్తించారు. నీటి ఉపరితలానికి 70 మీటర్ల లోతు నుంచి నిశాంత్ మృతదేహాన్ని వెలికి తీశారు. ప్రోటోకాల్ ప్రకారం, అతని కుటుంబానికి సమాచారం అందించిన అధికారులు పోస్టుమార్టం నిమిత్తం నిశాంత్ సింగ్ మృతదేహాన్ని తరలించారు.
ఏడాది కాలంలో మిగ్ విమాన ప్రమాదాలు మూడు
ఒక సంవత్సర కాలంలో మిగ్ విమానాలకు సంబంధించిన మూడు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. గత ఏడాది నవంబర్లో దక్షిణ గోవా జిల్లాలో మిగ్ -29 కె జంట సీట్ల యుద్ధ విమానం కూలిపోయింది. అప్పుడు పైలట్లు ఇద్దరూ సురక్షితంగా రక్షింపబడ్డారు. ఈ ఏడాది ఫిబ్రవరి 23 న గోవాలోని వాస్కోలోని ప్రముఖ నావికాదళ వైమానిక కేంద్రం ఐఎన్ఎస్ హన్సా నుంచి బయలుదేరిన మరో ఎంఐజి -29 కె గోవా తీరంలో అరేబియా సముద్రంలో కూలిపోయింది. విమాన పైలట్ సురక్షితంగా బయట పడ్డాడు. ఇప్పుడు నవంబర్ 26వ తేదీన మిగ్ -29 కె విమానం ప్రమాదానికి గురి కాగా పైలట్ నిశాంత్ సింగ్ మరణించారు .
యుద్ధ విమానాలు కూలటం , పైలట్ల మృతితో ఇండియాకు తీరని నష్టం
మిగ్
-29
కె
అనేది
ఆల్-వెదర్
క్యారియర్
ఆధారిత
మల్టీరోల్
ఫైటర్
విమానం,
ఇది
రష్యన్
ఏరోస్పేస్
కంపెనీ
మికోయన్
(మిగ్)
చే
అభివృద్ధి
చేయబడింది.
ఐఎన్ఎస్
విక్రమాదిత్య
నుండి
పనిచేయడానికి
భారత
నావికాదళం
ఒక
దశాబ్దం
క్రితం
రష్యా
నుండి
45
మిగ్
-29
కె
విమానాలను
2
బిలియన్
డాలర్ల
వ్యయంతో
కొనుగోలు
చేసింది.
భారత
యుద్ధ
విమానాలు,
రవాణా
విమానాలు
వరుసగా
నేలకొరుగుతూనే
ఉన్నాయి.
అత్యంత
విలువైన
యుద్ధ
విమానాలు
కోల్పోవడంతో
పాటు
కఠినమైన
శిక్షణ
పొందిన
పైలట్లను
కూడా
కోల్పోవడం
భారత
దేశానికి
అత్యంత
నష్టాన్ని
చేకూరుస్తుంది.