వీకెండ్ మసాలా: బెంగళూరులో సన్నీ లియోన్ సన్నీ నైట్స్, భారీ పోలీసు బందోబస్తు!
బెంగళూరు: బాలీవుడ్ నటి సన్నీ లియోన్ నైట్స్ షో నిర్వహించడానికి నిర్వాహకులు చివరికి బెంగళూరు పోలీసులను ఆశ్రయించారు. ఎలాంటి అడ్డంకులు లేకుండా సన్నీ నైట్స్ కార్యక్రమం నిర్వహించడానికి పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
గత ఏడాది నుంచి బెంగళూరులో సన్నీ నైట్స్ కార్యక్రమం నిర్వహించాలని నిర్వహకులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే సన్నీ లియోన్ నైట్స్ ను ఆడ్డుకుంటామని పలు కన్నడ సంఘాలు హెచ్చరికలు జారీ చెయ్యడంతో ఆ కార్యక్రమాలు వాయిదా పడుతున్నాయి.
బెంగళూరులోని మన్యతా టెక్ పార్క్ లోని వైట్ ఆర్కేడ్ లో నంబర్ 3వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సన్నీ నైట్స్ కార్యక్రమం నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. సన్నీ లియోన్ నైట్స్ కార్యక్రమం అడ్డుకుంటామని కొన్ని కన్నడ సంఘాలు హెచ్చరించాయి.
సన్నీ నైట్స్ నిర్వహకులు పోలీసులను ఆశ్రయించారు. సన్నీ నైట్స్ కార్యక్రమం జరిగే ప్రాంతంలో 330 మంది పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇద్దరు ఏసీపీలు, ఆరు మంది ఇన్స్ పెక్టర్లు, 15 మంది సబ్ ఎన్స్ పెక్టర్లతో పాటు మొత్తం 330 మంది పోలీసులు బందోబస్తుకు ఏర్పాటు చేశారు.
వీకెండ్ కాండంతో సన్నీ నైట్స్ షో టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయని సమాచారం. సన్నీ నైట్స్ షోలో మూడు పాటలకు సన్నీ లియన్ డ్యాన్స్ చెయ్యనుంది. ఇదే కార్యక్రమంలో ప్రముఖ కన్నడ సినీ దర్శకుడు, గాయకుడు రఘు దీక్షిత్ సందడి చెయ్యనున్నారు.