బాలీవుడ్ డ్రగ్స్ కేసు .. జయసాహా సంచలనం : శ్రద్ధా కోసం డ్రగ్ ఆర్డర్ .. సుశాంత్ తాగే టీలో ఆ డ్రగ్
దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ కేసులో డ్రగ్స్ కోణంపై ఎన్సీపీ దర్యాప్తు చేస్తోంది. సంచలనాత్మకంగా మారిన ఈ కేసులో అనేక కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రియా చక్రవర్తి డిలీట్ చేసిన వాట్సప్ చాట్ ద్వారా డ్రగ్స్ కోణం వెలుగులోకి రాగా , అది బాలీవుడ్ లో ప్రకంపనలు రేపింది . రియా చక్రవర్తి విచారణలో ఆమె బాలీవుడ్ కు చెందిన 25 మంది ప్రముఖుల పేర్లు వెల్లడించినట్టు తెలుస్తుంది. రియా ద్వారా డ్రగ్స్ వ్యవహారంలో సుశాంత్ మాజీ మేనేజర్ జయా సాహా పాత్రను గుర్తించిన నార్కోటిక్స్ అధికారులు ఆమెను విచారిస్తున్నారు .
బాలీవుడ్ డ్రగ్స్ కేసు ... తెరపైకి దియా మీర్జా పేరు ... ఆరోపణలను ఖండించిన మీర్జా
శ్రద్ధా కపూర్ కు ఆన్ లైన్ లో డ్రగ్ ఆర్డర్ చేశానన్న జయా సాహా
ఈ కేసును విచారిస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులకు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ టాలెంట్ మేనేజర్ జయ సాహా సంచలన విషయాలను వెల్లడించినట్లు సమాచారం.వరుసగా రెండు రోజుల పాటు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ మేనేజర్ జయసాహాను విచారించారు ఎన్సీబీ అధికారులు . నేడు మూడో రోజు కూడా విచారణ కొనసాగుతుంది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులకు జయసాహా కీలక విషయాలను చెప్పినట్లుగా తెలుస్తుంది . ఆన్లైన్ ద్వారా నటి శ్రద్ధా కపూర్ కి తానే సీబీడీ ఆయిల్ అనే డ్రగ్ ను ఆర్డర్ చేశానని ఆమె చెప్పినట్టు సమాచారం.
' సిబిడి ఆయిల్ ' డ్రగ్ .. సుశాంత్ తాగే టీలో నాలుగైదు చుక్కలు
సుశాంత్, రియా చక్రవర్తి, చిత్ర నిర్మాత మధు మంతెన తో పాటు తన కోసం కూడా సిబిడి ఆయిల్ను ఆర్డర్ చేసినట్లు ఆమె అంగీకరించిందని తెలుస్తుంది . అలాగే రియా చక్రవర్తి కి వాట్సాప్ ద్వారా సుశాంత్ కు ఇచ్చే డ్రగ్ ను ఎలా వినియోగించాలో చెప్పానని చెప్పినట్లుగా సమాచారం. సిబిడి ఆయిల్ అనే డ్రగ్ ను సుశాంత్ తాగే టీలో నాలుగైదు చుక్కలు కలిపి ఇవ్వాలని, అలా అర గంట కోసారి ఇవ్వాలని రియా చక్రవర్తికి సూచించానని జయసాహా తెలిపినట్లుగా సమాచారం. ఇక శ్రద్ధా కపూర్ కి మాత్రం తాను సిబిడి ఆయిల్ ఆర్డర్ చేశానని మాత్రమే చెప్పినట్లుగా తెలుస్తోంది. డ్రగ్స్ కొనుగోలు వ్యవహారంపై జయసాహా చేసిన చాటింగ్స్ ద్వారా నార్కోటిక్స్ అధికారులు కీలక సమాచారాన్ని సేకరిస్తున్నారు.
Recommended Video
జయా సహాను ఎన్సీబీ అరెస్ట్ చేసే అవకాశం
కోడ్ లాంగ్వేజ్ లో ఉన్న ఆమె వాట్సప్ చాటింగ్ డీ కోడింగ్ చేసి ఈ డ్రగ్స్ వ్యవహారంలో ఉన్న వారికి సమన్లు పంపిస్తున్నారు. ఈ కేసులో చాలా మంది ప్రముఖ సెలబ్రిటీలు ఉన్నట్టుగా తెలుస్తుంది. నిషేధిత డ్రగ్స్ వ్యవహారంలో డ్రగ్స్ సరఫరా చేసే డ్రగ్ పెడ్లర్స్ తో ఎటువంటి సంబంధం లేదని జయా సాహా ఇప్పటి వరకు తనపై వచ్చిన ఆరోపణలను ఖండించింది. తాజాగా ఆమె ఒప్పుకోవటంతో ఆమెను ఎన్సీబీ అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి సుశాంత్ సింగ్ రాజ్ పూత్ మరణం తర్వాత వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కోణం బాలీవుడ్ ను షేక్ చేస్తోంది. ఈ కేసులో ముందు ముందు మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తాయో అన్న భావన కలుగుతుంది.