మామ్: కరీనా స్పందన ఇలా, సైఫ్ ఇప్పటికే ఉన్నాడని..
ముంబై: ఈ నెల 24వ తారీఖున భారత్ మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్)ను అంగారక కక్షలో ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. దీనిపై ప్రముఖులంతా హర్షం వ్యక్తం చేశారు! సామాన్యులు కూడా ఈ విజయం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. అయితే, మామ్ గురించి బాలీవుడ్ నటి కరీనా కపూర్ను అడిగినప్పుడు ఆమె స్పందించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.
ముంబైలోని ఓ హెయిల్ ప్రోడక్ట్ లాంచింగ్కు వచ్చిన ఓ జర్నలిస్టు కరీనా కపూర్ను మార్స్ గురించి అడిగారు. అయితే, దానికి ఆమె 'వాట్' అంటూ అడిగారు. అయితే, అదేమిటన్నట్లుగా ఆమె తీరు ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.
అయితే, అనంతరం ఒకరు దీని పైన ఆంగ్లంలో ఆమెకు వివరించారు. అనంతరం ఆమె దానిపై స్పందిస్తూ.. 'గ్రేట్. అది మనకు చాలా గొప్ప దినమని, తనకు కూడా స్పేస్లోకి వెళ్లాలని ఉంది' అని ఆమె వ్యాఖ్యానించింది.
అనంతరం ఒకరు మరో ప్రశ్న వేశారు. మీతో పాటు స్పేస్కు సైఫ్ను కూడా తీసుకు వెళ్తారా అని ప్రశ్నించారు. దానికి ఆమె స్పందిస్తూ.. సైఫ్ ఇప్పటికే స్పేస్లో ఉన్నారని వ్యాఖ్యానించింది.