వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లక్నో కోర్టు వద్ద బాంబు పేలుడు: ముగ్గురు న్యాయవాదులకు గాయాలు

|
Google Oneindia TeluguNews

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని సెషన్స్ కోర్టు ప్రాంగణంలో గురువారం బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ముగ్గురు న్యాయవాదులు గాయపడ్డారు. వీరిలో ఇద్దరికి స్వల్ప గాయాలు కాగా.. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని.. అణువణువు గాలించారు. మరో మూడు పేలని బాంబ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బాంబులను నాటు బాంబులుగా గుర్తించారు.

Bomb blast at Lucknow court three lawyers injured

ప్రాథమిక సమాచారం ప్రకారం.. న్యాయవాదుల మధ్య నెలకొన్న వివాదాలే పేలుళ్లకు దారి తీసి ఉంటాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంజీవ్ లోధి అనే న్యాయవాదిని లక్ష్యంగా చేసుకుని ప్రత్యర్థులు కోర్టులో బాంబు దాడికి పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. లోధి ప్రస్తుతం లక్నో బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా కొనసాగుతున్నారు. మరోవైపు ఘటనపై వజీర్‌గంజ్ పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు జరుపుతున్నారు. పేలుళ్లకు పాల్పడిన నిందితుల్లో ఒకరిని జీతు యాదవ్‌గా గుర్తించారు.

English summary
A bomb blast rocked a Lucknow court on Thursday injuring three lawyers on the premises
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X