బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలో ఉగ్రవాదుల మకాం, పేలుడు పదార్థాలు సీజ్, ఐటీ!
బెంగళూరు: బెంగళూరు నగరంలోని ఎలక్ట్రానిక్ సిటీలో బంగ్లాదేశ్ కు చెందిన జమాత్ ఉల్ ముజాహుద్దీన్ ఉగ్రవాదులు తలదాచుకున్నారని ఎన్ఐఏ అధికారుల విచారణలో వెలుగు చూసింది. ఎలక్ట్రానిక్ సిటీలో దాడులు చేసిన ఎన్ఐఏ అధికారులు పేలుడు పదార్థాలు, విలువైన సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు.
అల్లుడి రాసలీలలు: అత్తపై మోజుతో కూతురుతో పెళ్లి , వీడియో వైరల్!
ఎన్ఐఏ కస్టడీలో ఉన్న జేఎంబీ ఉగ్రవాది జాహీదుల్ ఇస్లాం అలియాస్ కౌసర్ ఇచ్చిన సమాచారం మేరకు ఎలక్ట్రానిక్ సిటీలో దాడులు చేసి సోదాలు జరిగాయని అధికారులు అంటున్నారు. ఎలక్ట్రానిక్ సిటీలో జేఎంబీ ఉగ్రవాదులు కొంత కాలం తలదాచుకున్నారని తెలిసింది.
2014లో బుద్వార్న్ పేలుడు నిందితుడు అయిన కౌసర్ దక్షిణ భారతదేశంలో ఉగ్రవాదులు తలదాచుకున్న ప్రాంతాల్లో నివాసం ఉండేవారితో టచ్ లో ఉండేవాడని అధికారుల విచారణలో వెలుగు చూసింది. అత్తిబెలే, కాడుగోడి, కేఆర్ పురం, చిక్కబాణవార, శికారిపాళ్య, ఎలక్ట్రానిక్ సిటీలో ఉగ్రవాదుల సానుభూతిపరులు ఉన్నారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మాజీ ప్రధాని మనుమడు, హీరో ఉప ఎన్నికల్లో పోటీ ?, నాడు సుమలత దెబ్బకు!
ఎలక్ట్రానిక్ సిటీలో నిందితులు తలదాచుకున్న ప్రాంతంలో పేలుడు పదార్థాలతో పాటు మ్యానువల్, గ్రెనేడ్ లాంటి పేలుడు పదార్థాలు, ప్లాస్టిక్ టేప్ తో చుట్టిన బ్యాటరీలు, ఎలక్ట్రిటిక్ వైర్లు, క్యపాసిటర్, మూడుస్విచ్ లు, మైక్రోలిథం సెల్ తదితర వస్తువులు, ఐడీ కార్డులు, చేతి గ్లౌస్ లు, ఇల్లు అద్దె తీసుకున్నట్లు ఉన్న పత్రాలు, బెంగాల్ బాషలో చేతిలో రాసిన పత్రాలు, డిజిటల్ కెమెరా, 2018 బెంగళూరులో చోరీ అయిన వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు.