వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గురుదాస్ పూర్ లో బాంబు కలకలం

|
Google Oneindia TeluguNews

గురుదాస్ పూర్: పంజాబ్ లోని గురుదాస్ పూర్ జిల్లా ప్రజలు ఉగ్రవాదులు జరిపిన దాడుల నుండి కోలుకోక ముందే మళ్లి బాంబు కలకలం రేగింది. విషయం తెలుసుకున్న ప్రజలు ఆందోళనకు గురైనారు. పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకోవడంతో స్థానికులు మరింత భయపడి పోయారు.

గురువారం గురుదాస్ పూర్ బస్ స్టాండ్ దగ్గర నల్లటి బ్యాగ్ వదలి పెట్టి వెళ్లారు. స్థానికులకు అనుమానం రావడంతో పోలీసు అధికారులకు సమాచారం అందించారు. మొదట గురుదాస్ పూర్ జిల్లా డిప్యూటి కమిషనర్ అభినవ్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

Bomb scare at bus stand in Gurdaspur in Punjab

బస్ స్టాండ్ లో ఉన్న ప్రయాణికులు అందరిని ఖాళీ చేయించారు. తరువాత జిల్లా ఎస్పీ గుర్ ప్రీత్ సింగ్, బాంబు నిర్వీర్యదళం బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బ్యాగ్ ను క్షుణ్ణంగా పరిశీలించారు. అందులోని కొన్ని వస్తులు బయటకు తీశారు.

తరువాత జిల్లా ఎస్పీ గుర్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ బస్ స్టాండ్ దగ్గర నల్లటి బ్యాగ్ స్వాదీనం చేసుకున్నామని అన్నారు. అయితే అందులో ఉన్నది బాంబులా, కాదా అనే విషయం మాత్రం ఆయన బయటకు చెప్పలేదు. బ్యాగ్ లో కొన్ని వస్తువులు స్వాదీనం చేసుకున్నామని అన్నారు. సోమవారం గురుదాస్ పూర్ జిల్లాలోని దీనానగర్ లో ముగ్గురు ఉగ్రవాదులు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే.

English summary
Police have put sand bags around the suspicious bag and have called bomb disposal squad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X