బాంబు భయంతో బెంబేలేత్తిన నటి ఖుష్బూ: ట్వీట్ ఇలా..
తన నివాసంలో బాంబు పెట్టినట్లు ఫోన్ రావడంతో సినీ నటి ఖుష్బూ బెంబేలెత్తిపోయారు. ఆ తర్వాత ఆమె తనకు ఏమీ కాలేదని ట్వీట్ చేశారు.
చెన్నై: ప్రముఖ సినీ నటి ఖుష్బూను బాంబు వార్త తీవ్రంగా కలవర పెట్టింది. తమిళనాడులోని ఖుష్బూ నివాసంలో బాంబు పెట్టినట్లు గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి బెదిరించారు. దీంతో భయపడిపోయిన ఖుష్బూ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. బాంబ్ స్క్వాడ్, జాగిలాల సాయంతో ఆమె ఇళ్లంతా సోదా చేశారు. ఎక్కడా బాంబుకు సంబంధించిన ఆనవాళ్లు లభించలేదు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఎవరో కావాలనే ఈ ఫోన్ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఖుష్బూ ఫిర్యాదు మేరకు ఆమెకు వచ్చిన కాల్ ఆధారాంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తాను బాగానే ఉన్నానని, తనకేం కాలేదని ప్రముఖ నటి, కాంగ్రెస్ మహిళా నేత కుష్బూ సుందర్ ట్వీట్ ద్వారా తెలియజేశారు. ఆమె ఇంటికి బాంబు బెదిరింపు ఫోన్కాల్ రావడంతో అభిమానులు ఆందోళన చెందారు. ఆమె ఎలా ఉన్నారో తెలుసుకునేందుకు పెద్ద ఎత్తున వాకబు చేశారు. దీంతో స్పందించిన కుష్బూ ట్విట్టర్ ద్వారా అభిమానులకు సందేశం ఇచ్చారు. తాను క్షేమంగానే ఉన్నానని, దిగులు చెందవద్దని సూచించారు.