ఆ పరిస్థితులో అతనితో తప్పు చేశా: యువతి, కేసు కొట్టేసిన కోర్టు
ముంబై: ఓ అత్యాచారం కేసులో బాంబే హైకోర్టు అసాధారణమైన నిర్ణయం తీసుకుంది. బాధితురాలికి నిందితుడు రూ.10 లక్షలు చెల్లించడంతో పాటు, ఆమె సమ్మతి మేరకు కోర్టు కేసును కొట్టి వేసింది.
బాధితురాలు ప్రస్తుతం ఏడో నెల గర్భవతి. తన అంగీకారంతోనే ప్రత్యేక పరిస్థితుల్లో ఈ తప్పు జరిగిందని బాధితురాలు కోర్టుకు తెలిపింది. తాము ఈ కేసును పరిష్కరించుకున్నామని, కేసు కొట్టేస్తే తనకు అభ్యంతరం లేదని తెలిపింది.
తొలుత ఆ బాధితురాలే.. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని, అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత మాత్రం ఆమె తాను తప్పుడు అభిప్రాయంతో ఫిర్యాదు చేశానని కోర్టుకు తెలిపింది.
ఇద్దరు పరస్పర అంగీకారంతో రిలేషన్ షిప్ పెట్టుకున్నారని, వీరిద్దరు సమస్యను పరిష్కరించుకున్నారని, కేసు కొట్టేయాలని నిందితుడి తరఫు లాయర్ చెప్పారు. పుట్టబోయే బిట్ట భవిష్యత్తు కోసం రూ.10 లక్షలు డిపాజిట్ చేశాడని, బాధితురాలి విజ్ఞప్తి మేరకు ప్రత్యేక పరిస్థితుల్లో కేసు కొట్టేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది.