No bail: రిపబ్లిక్ టీవీ చీఫ్ అర్నబ్ గోస్వామికి మరో ఎదురెబ్బ, షాక్ ఇచ్చిన హైకోర్టు, అక్కడే చూసుకోండి
ముంబాయి/ న్యూఢిల్లీ: భారతదేశ మీడియా రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్, ప్రముఖ జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామికి బాంబే హైకోర్టులో సోమవారం ఎదురుదెబ్బ తగిలింది. 2018 మే నెలలో అర్కిటెక్ట్ అన్వయ్ నాయక్, ఆయన తల్లి ఆత్మహత్యల కేసులో అరెస్టు అయిన అర్నబ్ గోస్వామి తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చెయ్యాలని బాంబే హైకోర్టును ఆశ్రయించారు. అర్నబ్ గోస్వామికి బెయిల్ మంజూరు చెయ్యకూడదని మహారాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదితో పాటు పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అర్నబ్ గోస్వామి బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు ఈరోజుకూడా ఫలించలేదు.
Blackmail: ప్రియురాలి నగ్న వీడియోలు తండ్రికి షేర్ చేశాడు, పైగా పండగ చేస్కో అని మెసేజ్, కాలేజ్ !
అర్నబ్ కు పలుకుబడి ఎక్కువ
2018 మే నెలలో అర్కిటెక్ట్ అన్వయ్ నాయక్, ఆయన తల్లి ఆత్మహత్యల కేసులో ముంబాయి పోలీసులు రిపబ్లిక్ టీవీ చీఫ్ ను అరెస్టు చేశారు. అర్నబ్ గోస్వామి తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చెయ్యాలని బాంబే హైకోర్టును ఆశ్రయించారు. అర్నబ్ గోస్వామికి బెయిల్ మంజూరు చెయ్యకూడదని, కేసు విచారణలో ఉందని, ఆయన పలుకుబడితో సాక్షాలు తారుమారు చేసే అవకాశం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్, ముంబాయి పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
అర్నబ్ కు నో బెయిల్
సోమవారం బాంబే హైకోర్టులో వాదనలు జరిగాయి. వాదనలు విన్న బాంబే హైకోర్టు అర్నబ్ గోస్వామికి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ప్రస్తుత పరిస్థితుల్లో పోలీసులకు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. అర్నబ్ గోస్వామి బెయిల్ పిటిషన్ ను బాంబే హైకోర్టు తిరస్కరించడంతో ఆయన షాక్ కు గురైనారు.
నాలుగు రోజులు టైమ్
హైకోర్టును ఆశ్రయించడానికి ముందే ఆలీబాగ్ సెషన్స్ కోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకోవాలని బాంబే హైకోర్టు అర్నబ్ గోస్వామికి సూచించింది. అయితే ఇప్పటికే రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామి తనకు బెయిల్ మంజూరు చెయ్యాలని ఆలీబాగ్ సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు. నాలుగు రోజుల్లో బెయిల్ పిటిషన్ పై నిర్ణయం తీసుకోవాలని ఆలీబాగ్ సెషన్స్ కోర్టుకు బాంబే హైకోర్టు ఆదేశించింది.
బయట భార్య పోరాటం
2018 మే నెలలో అర్కిటెక్ట్ అన్వయ్ నాయక్, ఆయన తల్లి ఆత్మహత్యల కేసులో ముంబాయి పోలీసులు రిపబ్లిక్ టీవీ చీఫ్ ను అరెస్టు చేశారు. తన భర్తను అరెస్టు చేసి జైలుకు పంపించారని, జైలులో ఉన్న సమయంలో జైలరు తన మీద దాడి చేశాడని తన భర్త తనకు చెప్పారని అర్నబ్ గోస్వామి భార్య సమ్యాబ్రతా రే ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మహారాష్ట్ర పోలీసులు, జైళ్ల శాఖ అధికారుల నుంచి తన భర్తకు అర్నబ్ గోస్వామికి ప్రాణహాని ఉందని, ఆయనకు ఏదైనా జరిగితే పోలీసులు, మహారాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని సమ్యాబ్రతా రే ఆరోపించారు. తన భర్త అర్నబ్ గోస్వామికి బెయిల్ మంజూరు చెయ్యాలని సమ్యాబ్రతా రే సుప్రీం కోర్టును ఆశ్రయించారు.