న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం బంపరాఫర్ ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగుల డీఏను 3 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ప్రభుత్వంపై రూ.9,200 కోట్ల అదనపు భారం పడనుంది. మంగళవారం కేంద్ర కేబినెట్ ముందుకు డీఏను పెంచాలనే ప్రతిపాదన వచ్చింది. దీనికి మంత్రివర్గం ఈ రోజు ఆమోదం తెలిపింది.
ప్రస్తుతం ఈ డీఏ 9 శాతంగా ఉంది. ఇప్పుడు మరో మూడు శాతం పెంచారు. పెన్షన్దారులకు కూడా మూడు శాతం పెంచింది. ఇది జనవరి 1, 2019 నుంచి నుంచే దీనిని ఇస్తారు. దీని వల్ల దాదాపు కోటి మందికిపైగా ప్రభుత్వ ఉద్యోగాలు, పెన్షన్దారులకు లబ్ధి చేకూరనుంది.
ఈ పెంపు వల్ల 48.41 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 68,03 లక్షల పింఛన్దారులకు లబ్ధి. ఏడో ప్రణాళికా సంఘం కమిషన్ నివేదిక ఆధారంగా దీనిని అమలు చేస్తున్నారు.
అలాగే, ట్రిపుల్ తలాక్ బిల్లుకు సంబంధించిన ఆర్డినెన్స్ను కూడా కేబినెట్ ఆమోదించింది. అలాగే కంపెనీ లా అమెండ్మెంట్ బిల్కు కూడా ఆమోదం తెలిపింది.
వీటితో పాటు ఢిల్లీ - ఘజియాబాద్-మీరట్ ర్యాపిడ్ రైల్ ట్రాన్సిట్ సిస్టం నిర్మాణ ప్రతిపాదనకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికి రూ.30,274 కోట్ల వ్యయం ఖర్చు కానుందని కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. కిసాన్ ఊర్జా సురక్షా ఔర్ ఉత్తాన్ మహాభియాన్ (కుసుమ్) పథకానికి కూడా కేబినెట్ ఆమోదం లభించినట్లుగా జైట్లీ తెలిపారు.
RECOMMENDED STORIES