కరోనా: లాక్డౌన్ టైంలో డెలివరీ, పాపకు కరోనా, బాబుకు కోవిడ్ పేర్లు, సెంటరాఫ్ అట్రాక్షన్గా ట్వీన్స్.
ఆయా విపత్తులు మనకు గుర్తుంటాయి. తుపాన్, సునామీలు సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. కానీ ఆ పేర్లను పెట్టుకునేందుకు కొందరు భయపడుతుంటారు. కానీ మరికొందరు మాత్రం నివసిస్తుంటారు. యూపీకి చెందిన దంపతులు ఉపాధి నిమిత్తం ఒడిశాలో ఉంటున్నారు. వారికి ఇదివరకు రెండేళ్ల పాప ఉంది. ఆమె ఇటీవల ఆస్పత్రిలో కవల పిల్లలకు జన్మనిచ్చారు. అమ్మాయి, అబ్బాయి... యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా, కోవిడ్ అనే పేరు పెట్టారు.
లాక్ డౌన్..
వైరస్ కేసులు పెరగడంతో మార్చి 24వ తేదీ నుంచి మూడువారాల పాటు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. సరిగ్గా ఆ సమయంలోనే రాయ్పూర్లో ఓ గర్బిణీ ప్రీతి వర్మకు పురిటినొప్పులు వచ్చాయి. అసలే లాక్ డౌన్.. అయినా ఆమె భర్త అంబులెన్స్ పిలిచారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మెమోరియల్ ఆస్పత్రి వెళ్లేవరకు ప్రతీ ఒక్క చెక్ పోస్ట్ వద్ద ఆపారు. నిండుచులాలు నొప్పులను చూసి.. పోలీసులు వెంటనే వెళ్లేందుకు అనుమతిచ్చారు. మార్చి 26 రాత్రి 11 గంటల సమయంలో ఆస్పత్రికి తీసుకెళ్లగా గంట వరకు సిజేరియన్ కోసం ఏర్పాట్లు చేశారు.
ట్వీన్స్ జననం..
ప్రీతి వర్మ దంపతులకు కవలలు జన్మించారు. రెండోసారి కాన్పు కోసం చాలా కష్టపడ్డామని ప్రీతి పీటీఐతో చెప్పారు. తమ డెలివరీ తర్వాత పాప, బాబును అందరూ కరోనా, కోవిడ్ అని పిలిచేవారు అని గుర్తుచేశారు. వాస్తవానికి వారికి వేరే పేర్లు అనుకొన్నామని... కానీ ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా వారి పేర్లను గుర్తుంచుకొనేందుకు కరోనా, కోవిడ్ అని పేరు పెట్టామని తెలిపారు.
మంచి అలవాట్లు
వైరస్ నేపథ్యంలో అందరూ పారిశుద్ద్యం క్లీన్ చేయడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తున్నారని ప్రీతి తెలిపారు. ఇవి చాలా మంచి అలవాట్లు అని పేర్కొన్నారు. అందుకోసమే కవల పిల్లలకు కరోనా, కోవిడ్ పేర్లు పెట్టాలని నిర్ణయం తీసుకున్నామని వివరించారు. డెలివరీ అయ్యాక ఆస్పత్రికి రావడానికి తమ బంధువులు ఇబ్బంది పడ్డారని ప్రీతి గుర్తుచేశారు. బస్సులే కాదు రైళ్లు కూడా నిలిచిపోయాయని చెప్పారు.
Recommended Video
గంటలోపే సిజేరియన్
ప్రీతికి కవలలు ఆరోగ్యంగా జన్మించారని ఆస్పత్రి పీఆర్వో చెప్పారు. వారు వచ్చిన 1 గంటలోపు సిజేరియన్ కోసం ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఇటీవలే పిల్లలతో సహా ప్రీతిని డిశ్చార్జ్ చేశామని చెప్పారు.