ప్రాణాలు తీసిన 'ఛోటా భీమ్': అక్క ఆత్మహత్యాయత్నం

మధ్యప్రదేశ్లోని గుణా జిల్లాలో గురువారం ఆ సంఘటన జరిగింది. ఎనిమిదేళ్ల బబాలూ ఛోటాభీమ్ను అనుకరించి మృతిచెందాడు. తాడుతో సాహసం చేయబోగా అది ప్రమాదవశాత్తు మెడకు ఉరిచుట్టుకుని అశువులుబాశాడు.
తొలుత అతడు చనిపోవడం చూసిన అతడి అక్క సోని కూడా ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. అయితే ఆమెను రక్షించి ఆస్పత్రిలో చేర్చారు. కాగా, ప్రమాద సమయంలో ఆ చిన్నారి తండ్రి ఇంట్లో లేడు. తల్లి వంట చేసుకుంటూ ఉండగా ఆ పిల్లలు ఆటల్లో ఛోటాభీమ్ను అనుకరించడంతో ఆ దారుణం సంభవించింది.
పిల్లలు అలా అనుకరించి మృత్యు ఒడిలోకి వెళ్లడం ఇదే ప్రథమం కాదు. అంతకుముందు పశ్చిమబెంగాల్లోని నదియా జిల్లాలో ఆరోతరగతి చదువుతున్న బాలుడు ప్రమాదవశాత్తు ఫ్యాన్కు ఉరిపడి ఊపిరి వదిలాడు.












Click it and Unblock the Notifications