వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పెట్రోలియం రిఫైనరీలో అగ్నిప్రమాదం: 43 మందికి గాయాలు
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని చంబూర్ ప్రాంతంలో ఉన్న భారత్ పెట్రోలియంకు చెందిన రిఫైనరీ ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 43 మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థతి విషమంగా ఉంది.
బుధవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న 7 అగ్నిమాపక వాహనాలు, రెండు భారీ ట్యాంకర్లు, రెండు ఫోమ్ వాహనాలు సంఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపుచేశాయి.
మొత్తం 22 మంది స్వల్ప గాయాలతో బయటపడగా.. 21 మందిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 4 కిలోమీటర్ల మేర దీని ప్రభావం కనిపించిందని అక్కడి స్థానికులు చెబుతున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Comments
English summary
State-run Bharat Petroleum Corp Ltd (BPCL) shut a hydrocracker unit at its Mumbai refinery on Wednesday evening following a fire that left more than 40 people injured, said a top company official.
Story first published: Wednesday, August 8, 2018, 22:25 [IST]